Mahua Moitra : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌స‌భ సభ్యత్వం రద్దు

డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ నివేదికతో మొయిత్రాపై చర్యలు తీసుకుంది.

Mahua Moitra : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌స‌భ సభ్యత్వం రద్దు

Mahua Moitra (1)

Updated On : December 8, 2023 / 6:25 PM IST

TMC MP Mahua Moitra : టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌స‌భ సభ్యత్వం రద్దు అయింది. నైతిక విలువల కమిటీ నివేదికకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. నైతిక విలువల కమిటీ నివేదికతో శుక్రవారం లోక్‌స‌భ మహువా మొయిత్రా సభ్యత్వం రద్దు చేసింది. డబ్బులు తీసుకుని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగారని మహువా మొయిత్రాపై ఆరోపణలు వచ్చాయి. ఎథిక్స్ కమిటీ నివేదికతో మహువా మొయిత్రాపై చర్యలు తీసుకుంది. ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మహువా మొయిత్రాను లోక్‌స‌భలో చర్చల్లో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమె లోక్‌స‌భ బయటికి వచ్చి మాట్లాడారు.

లోక్‌స‌భ నుంచి విపక్షాల వాకౌట్
మహువా మొయిత్రా లోక్‌స‌భ సభ్యత్వం రద్దు చేయడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. లోక్‌స‌భ నుంచి వాకౌట్ చేసి పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా పగ సాధించేందుకే చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

ఎథిక్స్ కమిటీ నిబంధనలను ఉల్లంఘించిందని మహువా మొయిత్రా పేర్కొన్నారు. ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరిస్తూ లోక్‌స‌భ తీర్మానించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షా సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం సభ డిసెంబర్ 11కు వాయిదా పడింది.

నన్ను బహిష్కరించే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదు : ఎంపీ మొహువా మొయిత్రా
తనను బహిష్కరించే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ఇది బీజేపీ అంతానికి నాంది అని పేర్కొన్నారు. ఈ లోక్‌సభ పార్లమెంటరీ కమిటీని ఆయుధంగా మార్చిందని ఆరోపించారు. సభ్యులకు నైతిక దిక్సూచిగా పనిచేయడానికి ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ, ఎథిక్స్ కమిటీని దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

విపక్షాలను బుల్‌డోజ్ చేయడం కోసం ఎథిక్స్ కమిటీని ఉపయోగించారని విమర్శించారు. తనను బహిష్కరించడం ద్వారా అదానీ సమస్యను దూరం చేయగలమని మోదీ ప్రభుత్వం భావిస్తోందన్నారు. యావత్ భారతదేశం మొత్తం కేంద్రం విధివిధానాల దుర్వినియోగం మోదీకి అదానీ ఎంత ముఖ్యమో తెలియజేస్తుందని తెలిపారు.