రూ.2 వేల కోట్ల కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం.. ఈ పథకంతో 2.9 కోట్ల మందికి ప్రయోజనాలు
ఎన్సీడీసీ కార్యనిర్వాహక సంస్థగా వ్యవహరిస్తుంది. ఇది రుణాల పంపిణీ, పర్యవేక్షణ, అమలు, ఫాలో-అప్, రికవరీ బాధ్యతలు వహిస్తుంది. ఇది నేరుగా అర్హత ఉన్న సహకార సంఘాలకు లేదా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రుణాలు ఇస్తుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన కేంద్రమంత్రి మండలి సమావేశంలో “గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NCDC)” పథకానికి ఆమోదముద్ర పడింది. దీని కింద 2025-26 నుంచి 2028-29 వరకు మొత్తం రూ.2,000 కోట్లు కేటాయింపు ఉంటుంది.
ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ..500 కోట్లు చొప్పున నాలుగు సంవత్సరాలపాటు ఎన్సీడీసీకి అందజేస్తారు. దీని ద్వారా మార్కెట్ నుంచి రూ.20,000 కోట్లు సమీకరించవచ్చు.
ఎన్సీడీసీ ఈ నిధులను నూతన ప్రాజెక్టులు ఏర్పాటుకు, సదుపాయాల విస్తరణకు, వర్కింగ్ కాపిటల్ అవసరాలను తీర్చడానికి వివిధ రంగాల్లోని సహకార సంఘాలకు రుణాలుగా ఇవ్వనుంది. వీటిలో పాలు, పశువులు, మత్స్య పరిశ్రమ, చక్కెర, వస్త్ర, ఆహార ప్రాసెసింగ్, నిల్వ, కోల్డ్ స్టోరేజ్, కార్మిక, మహిళల ఆధ్వర్యంలోని విభాగాలు ఉంటాయి.
Also Read: నో రిలాక్స్.. ఓన్లీ వర్క్..మంత్రులకు ఊస్టింగ్ గుబులు..!
ఈ రూ.2,000 కోట్ల గ్రాంట్ను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా సమకూర్చనుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 13,288 సహకార సంఘాల్లోని సుమారు 2.9 కోట్ల సభ్యులకు లాభం చేకూరుతుంది.
ఎన్సీడీసీ కార్యనిర్వాహక సంస్థగా వ్యవహరిస్తుంది. ఇది రుణాల పంపిణీ, పర్యవేక్షణ, అమలు, ఫాలో-అప్, రికవరీ బాధ్యతలు వహిస్తుంది. ఇది నేరుగా అర్హత ఉన్న సహకార సంఘాలకు లేదా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రుణాలు ఇస్తుంది.
ఈ రుణాలు మోడర్నైజేషన్, సాంకేతిక నవీకరణ, విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం దీర్ఘకాలిక రుణాలు, అలాగే వర్కింగ్ కాపిటల్కు ఉపయోగపడతాయి. ఉద్యోగాల సృష్టి, మహిళల పనివర్గం భాగస్వామ్యం పెరుగుదల, గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. భారతదేశంలో 8.25 లక్షలకుపైగా సహకార సంస్థలు ఉన్నాయి. రుణాలు, బ్యాంకింగ్, వినియోగ వస్తువులు, చేనేత, మత్స్యకారులు, హౌసింగ్ వంటి విభాగాల్లో ఈ రంగం విస్తారంగా ఉంది.