Viral Video: స్టేజీపై ఈ యువకుడు జై శ్రీరాం అన్నందుకు.. ఏం జరిగిందో చూడండి..
ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్లపై కాలేజీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Ghaziabad college student
Jai Shri Ram on stage: కాలేజీ ఫెస్ట్లో స్టేజీపై ఓ యువకుడు జై శ్రీరాం అని నినదించాడు. దీంతో అతడిని స్టేజీపై నుంచి దించేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో ఏబీఈఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది. ఆ కాలేజీలో తాజాగా ఫెస్ట్ నిర్వహించారు. విద్యార్థులు అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఇందులో పాల్గొంటున్నారు. ఓ విద్యార్థి స్టేజీ ఎక్కి తన ప్రదర్శనను ప్రారంభిస్తున్న సమయంలో కింది నుంచి కొందరు తోటి విద్యార్థులు జై శ్రీరాం అని నినాదాలు చేశారు.
దీంతో స్టేజీపై ఉన్న విద్యార్థి కూడా జై శ్రీరాం ఫ్రెండ్స్ అని మైకులో రిప్లై ఇచ్చాడు. ఆ వెంటనే అతడిని ఓ ప్రొఫెసర్ స్టేజీపై నుంచి కిందికి దిగాలని ఆదేశించారు. ఇది సాంస్కృతిక కార్యక్రమమని, అటువంటి నినాదాలు చేయకూడదని ఆ ప్రొఫెసర్ తిట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఘజియాబాద్ పోలీస్ కమిషనర్ దీనిపై స్పందించారు.
ఆ ఘటనపై దర్యాప్తు చేయాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. కాగా, జై శ్రీరాం నినాదం చేసినందుకు విద్యార్థిని స్టేజీ దిగాలని చెప్పిన ప్రొఫెసర్ తో పాటు మరో ప్రొఫెసర్ పై కాలేజీ అధికారులు చర్యలు తీసుకున్నారు. వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
A student from ABES college (Ghaziabad) was expelled from stage by a professor for saying Jai Shri Ram before performance; Video goes viral pic.twitter.com/TtC3q3N4eS
— Megh Updates ?™ (@MeghUpdates) October 20, 2023
PARVA : కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ మహాభారతం.. ‘పర్వ’ టైటిల్తో మూడు భాగాలుగా..