మహిళలు శబరిమలకు వెళ్లొద్దు.. మనసులో చెడు భావన కలుగుతుంది

ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ మహిళలకు కీలక విజ్ఞప్తి చేశారు. మహిళలు శబరిమలకు వెళ్లొద్దని కోరారు. చెన్నైలో శనివారం(డిసెంబర్ 14,2019) మీడియాతో మాట్లాడిన

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 02:53 AM IST
మహిళలు శబరిమలకు వెళ్లొద్దు.. మనసులో చెడు భావన కలుగుతుంది

Updated On : December 15, 2019 / 2:53 AM IST

ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ మహిళలకు కీలక విజ్ఞప్తి చేశారు. మహిళలు శబరిమలకు వెళ్లొద్దని కోరారు. చెన్నైలో శనివారం(డిసెంబర్ 14,2019) మీడియాతో మాట్లాడిన

ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ మహిళలకు కీలక విజ్ఞప్తి చేశారు. మహిళలు శబరిమలకు వెళ్లొద్దని కోరారు. చెన్నైలో శనివారం(డిసెంబర్ 14,2019) మీడియాతో మాట్లాడిన ఏసుదాస్.. ‘ఒకప్పుడు అయ్యప్పస్వామి మాల వేసే భక్తులు వారి ఇంట్లోని స్త్రీలనూ చూసేవారు కాదు. ఇప్పుడు కాలం మారిపోయింది. ఎవరైనా అమ్మాయి శబరిమలకు వెళ్తే దీక్షలో ఉన్న భక్తులు చూస్తారు. ఇది వారి మనసులో చెడు భావనను కలిగిస్తుంది.  అందుకే శబరిమలకు వెళ్లొద్దని మహిళలను వేడుకుంటున్నా. మహిళలు వెళ్లడానికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లొచ్చు. అయ్యప్ప భక్తుల దీక్షను భగ్నం చేయొద్దు’ అని ఏసుదాస్‌ వేడుకున్నారు.

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని 2018 సెప్టెంబర్ లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు ఉందని అయ్యప్ప భక్తులు నిరసనలు, ఆందోళనలు తెలిపారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలు కావడం.. దానిని విస్తృత ధర్మసనానికి బదిలీ చేయడంతో ఈ ఏడాది(2019) మాత్రం మహిళలను ఆలయంలోకి అనుమతించబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ప్రముఖ గాయకుడు, అయ్యప్ప భక్తుడు కేజే ఏసుదాసు స్పందిస్తూ కీలక విన్నపం చేశారు. మహిళలు శబరిమలకు రావొద్దని కోరారు. అయితే ఏసుదాస్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను అయ్యప్ప భక్తులు స్వాగతించారు. మంచి మాట చెప్పారని మెచ్చుకున్నారు. మహిళలు మాత్రం మండిపడుతున్నారు. ఏసుదాస్ వ్యాఖ్యలను వారు ఖండించారు.

కాగా, శబరిమల ఆలయంలోకి పోలీసుల భద్రతో మహిళలను సురక్షితంగా పంపేలా కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వులకు సుప్రీంకోర్టు శుక్రవారం(డిసెంబర్ 13,2019) నిరాకరించింది. ఇది చాలా సున్నితమైన, భావోద్వేగంతో కూడుకున్న అంశమని.. పరిస్థితి హింసాత్మకంగా మారడానికి తాము సమ్మతించబోమని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై ఏడుగురు జడ్జిలతో కూడిన విస్తృత ధర్మాసనం అంతిమ నిర్ణయం ఇచ్చే వరకు తాము ఎలాంటి ఆదేశాలు జారీచేయలేమని స్పష్టం చేసింది.

మహిళలకు భద్రత కల్పించాలంటూ కేరళ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం కూడా సముచితం కాదంది. వేలాది సంవత్సరాలుగా అక్కడ ఈ ఆచారం కొనసాగుతుందని.. అందుకే మీకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయలేయమని పిటిషనర్లను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతి కల్పిస్తూ ఇచ్చిన తీర్పును పున: సమీక్షించాలంటూ కొన్ని పిటిషన్లను ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీం కోర్టు నవంబర్ నెలలో నిర్ణయించిన విషయం తెలిసిందే.