Akkineni Family: ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం.. ఫొటోలు వైరల్..
Akkineni Family Meet PM Modi: నిన్న పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీని అక్కినేని ఫ్యామిలీ కలిసిన విషయం తెలిసిందే. డిసెంబర్ నెలలో జరిగిన మాన్ కి బాత్ లో అక్కినేని నాగేశ్వర్ రావు పై ప్రశంసల జల్లు కురిపించారు ప్రధాని మోదీ. ఈ సందర్బంగా ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. అక్కినేని నాగేశ్వరరావుపై మాజీ ఎంపీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన 'మహాన్ అభినేత అక్కినేని కావిరాట్ వ్యక్తిత్వ' అనే పుస్తకాన్ని సినీ హీరో అక్కినేని నాగార్జున మోదీకి ఆందజేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, అమల, నాగ చైతన్య, శోభిత, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తదితరులు ఉన్నారు. ప్రస్తుతం వీటికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.







