CM Chandrababu Naidu: మనవడు దేవాంశ్, కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. ఫొటోలు వైరల్
CM Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానం నిర్వహించారు. చంద్రబాబు, లోకేశ్, దేవాంశ్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించారు.















