Ayodhya Dhwajarohan Utsav : అయోధ్య రామాలయం ధ్వజారోహణ ఉత్సవం.. హాజరయిన పీఎం మోడీ, యోగీ ఆదిత్యనాథ్.. ఫోటోలు చూశారా..
అయోధ్య రామాలయంలో నేడు అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మోదీ అయోధ్యలోని బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు.






















