Bhogapuram Airport : భోగాపురంలో ఎయిర్పోర్టులో ల్యాండైన తొలి విమానం.. రామ్మోహన్ నాయుడు సూపర్ ఎంట్రీ.. ఫొటోలు వైరల్
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టులో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి భోగాపురం విమానాశ్రయంకు తొలి విమానం చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు దిగారు. వారికి స్థానిక నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.










