సీఎం జగన్ తో భేటీ : విజయవాడ చేరుకున్న చిరంజీవి దంపతులు
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. జగన్ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు.

ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. జగన్ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు.
ఏపీ సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ కానున్నారు. జగన్ను కలిసేందుకు చిరంజీవి సతీసమేతంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో చిరుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లికి బయల్దేరిన చిరంజీవి దంపతులు… అక్కడ సీఎం జగన్తో లంచ్ మీటింగ్లో పాల్గొంటారు.
మధ్యాహ్నం 1.30 గంటలకు జగన్, చిరంజీవి మధ్య లంచ్ మీటింగ్ జరగనుంది. ఇరు వర్గాలు మర్యాదపూర్వక సమావేశమే అంటున్నప్పటికీ సినీ, రాజకీయ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. జగన్ సీఎం అయిన తర్వాత టాలీవుడ్ నుంచి బడా స్టార్స్ ఎవరూ ఆయనను మర్యాదపూర్వకంగా కూడా కలవలేదంటూ వైసీపీ నేతలు విమర్శించారు. టాలీవుడ్లోని కొందరు ప్రముఖులకు జగన్ సీఎం కావడం ఇష్టం లేదని ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి విమర్శల నేపథ్యంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి జగన్ను కలవనుండటంతో అటు టాలీవుడ్తో పాటు ఇటు రాజకీయ వర్గాలు కూడా ఈ పరిణామాలను ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. సైరా నరసింహారెడ్డి సినిమాను వీక్షించాలని కోరేందుకే జగన్ను చిరంజీవి కలుస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలాగే.. ఏపీలో సైరా మూవీకి స్పెషల్ షోలు వేసేందుకు అనుమతి ఇచ్చినందుకు.. సీఎం జగన్ను కలిసి చిరంజీవి ధన్యవాదాలు చెప్పనున్నారు.
సైరా మూవీ సక్సెస్తో చిరంజీవి మంచి జోష్లో ఉన్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సైరాను.. సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈమధ్యే.. తెలంగాణ గవర్నర్ తమిళిసై ఫ్యామిలీకి స్పెషల్ షో వేసి మూవీ చూపించారు మెగాస్టార్.
సైరా సినిమా గురించి మాత్రమే జగన్తో భేటీ అవుతున్నట్లు చిరంజీవి కూడా క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ.. వీళ్లిద్దరూ తాజా రాజకీయాలపై కూడా చర్చిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చిరంజీవి వెంట మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా సీఎం జగన్ను కలవబోతున్నట్లు సమాచారం. కొంతకాలంగా గంటా పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో గంటా కూడా జగన్తో భేటీ కానున్నారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు.
వాస్తవానికి అక్టోబర్ 11న సీఎం జగన్తో చిరంజీవి భేటీ కావాల్సి ఉంది. కానీ, సీఎం బిజీ షెడ్యూల్తో అది ఇవాళ్టికి వాయిదా పడింది. ఈ భేటీ వెనుక రాజకీయ కారణాలు లేవంటున్నారు. సైరా సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే జగన్ సీఎం అయ్యాక ఇప్పటి వరకు చిరంజీవి కలవలేదు. అందుకే జగన్ను కలిసి ధన్యవాదాలు తెలపడంతో పాటూ సీఎంగా బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపేందుకే అమరావతి వెళ్తున్నారని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరాజన్ను చిరంజీవి కలిశారు. సైరా సినిమా చూడాలని కోరారు.. ఆమె కూడా కుటుంబంతో కలిసి మూవీని వీక్షించారు. అలాగే జగన్ను కూడా సినిమా చూడాలని చిరంజీవి ఆహ్వానిస్తారని తెలుస్తోంది.