Randeep Surjewala: బీజేపీకి ఓటేసేవాళ్లంతా రాక్షసులట.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత

రణదీప్ సుర్జేవాలా పెద్ద నాయకుడని, బలమైన నాయకుడని, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి ప్రకటన ఇచ్చారని, ఆయన ప్రకటన వెనుక సమాజంలో ఉద్రిక్తతలను పెంచుతున్న తీరునే కారణమని జేడీయూ అధికార ప్రతినిధి అంజుమ్ అరా అన్నారు

Randeep Surjewala: బీజేపీకి ఓటేసేవాళ్లంతా రాక్షసులట.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత

Updated On : August 14, 2023 / 7:21 PM IST

Bihar: భారతీయ జనతా పార్టీకి ఓట్లేసేవారంతా రాక్షసులంటూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‭దీప్ సింగ్ సూర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం బిహార్ రాష్ట్రంలోని కైతాల్‌లో జరిగిన జన్ ఆక్రోశ్ ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ ఉష్ణోగ్రత పెరిగింది. నిజానికి ఈ ప్రకటన ప్రభావం బీహార్‌లోనూ కనిపిస్తోంది.‘‘బీజేపీకి, జేజేపీలకు ఓటేసే వారు రాక్షస స్వభావం కలవారు. నేను ఈనాటి మహాభారతంలో ఉన్నాను. వారిని ఈ రోజు శపిస్తాను’’ అంటూ సుర్జేవాలా ఆగ్రహమైన స్వరంతో అన్నారు.

Vande Bharat Express: విద్యార్థులకు ఉచితంగా వందే భారత్ రైలు ప్రయాణం.. ఎప్పుడు, ఎక్కడ?

ఆర్జేడీ అధికార ప్రతినిధి ఐజాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఇలాంటి ప్రకటనలు మనమెప్పుడూ వినలేదని, అయితే రాజకీయాల్లో చెడు సంస్కృతిని ప్రారంభించిన ప్రతి ఒక్కరు తమ సంప్రదాయాన్ని మానుకోవాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజేష్ రాథోడ్ మాట్లాడుతూ.. రణ్‌దీప్‌ సూర్జేవాలా ఏ సందర్భంలో ఇలా అన్నారో తెలియదని, అయితే లోక్‌సభలో ప్రధాని తన ప్రవర్తనను చూపించిన తీరు, స్మృతి ఇరానీ ప్రవర్తన, బీజేపీ మంత్రులంతా మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన సమస్యలపై అవిశ్వాస తీర్మానం మీ ప్రవర్తనను చూడాలని అన్నారు.

Independence Day: మొబైల్ కవర్‭పై జాతీయ జెండా ఉంటే జైలుకే.. జాతీయ జెండాకు పాటాల్సించాల్సిన రూల్స్ ఏంటంటే?

మరోవైపు, రణదీప్ సుర్జేవాలా పెద్ద నాయకుడని, బలమైన నాయకుడని, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలాంటి ప్రకటన ఇచ్చారని, ఆయన ప్రకటన వెనుక సమాజంలో ఉద్రిక్తతలను పెంచుతున్న తీరునే కారణమని జేడీయూ అధికార ప్రతినిధి అంజుమ్ అరా అన్నారు. ఉన్మాద రాజకీయాలు చేస్తున్నారని, ఈ ప్రకటన కూడా అలానే వచ్చి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.