karthika Vana Bhojanam : శ్రీనివాస మంగాపురంలో ఏకాంతంగా కార్తీక వనభోజనం
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈరోజు కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది.
karthika Vana Bhojanam : చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈరోజు కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. కోవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత ఆస్థానం, వనభోజనం కార్యక్రమాలు చేపట్టారు.
Also Read : Tiruchanoor : పెద్దశేష వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు