టెస్ట్ మ్యాచ్ లు ఇక నాలుగు రోజులే 

  • Published By: chvmurthy ,Published On : December 31, 2019 / 06:10 AM IST
టెస్ట్ మ్యాచ్ లు ఇక నాలుగు రోజులే 

Updated On : December 31, 2019 / 6:10 AM IST

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సంప్రదాయ క్రికెట్‌ను తప్పనిసరిగా కుదించాలనే యోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట కాస్తా నాలుగు రోజులకే పరిమితం కానుంది.అంటే మరో మూడేళ్ల తర్వాత నాలుగు రోజుల టెస్టులే కనిపించే అవకాశముంది. ట్రెడిషనల్‌‌ ఐదు రోజుల టెస్ట్‌‌లను కుదించడం ద్వారా లభించే సమయంతో మరిన్ని టోర్నీలు నిర్వహించేందుకు మార్గం సుగమం చేయాలని  భావిస్తోంది. 

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ద్వైపాక్షిక సిరీస్‌లు పెరగాలని గతంలో డిమాండ్‌ చేసింది. అయితే వివిధ దేశాల్లో టి20 లీగ్‌లు జరుగుతుండటం వల్లే టెస్టులను కుదిస్తున్నారని తెలిసింది. ఇది కొత్తగా ఇప్పుడే వచ్చిన మార్పు కాదు. ఇంతకు మునుపు ఈ ఏడాది ఇంగ్లండ్, ఐర్లాండ్‌ల మధ్య నాలుగు రోజుల టెస్టు జరిగింది. 2017లోనూ దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు …..ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్–ఐర్లాండ్ ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్‌‌లు ప్రయోగాత్మకంగా నిర్వహించారు.
 

ఒకవేళ 2015–2023 మధ్యే ఈ నాలుగు రోజుల కాన్సెప్ట్‌‌ను అమలు చేస్తే  క్రికెట్‌‌ షెడ్యూల్‌‌లో 335 రోజులు ఫ్రీ అయ్యేవి.  అయితే ఐసీసీ ప్రతిపాదనపై  సభ్యదేశాలు, స్టేక్‌‌హోల్డర్స్‌‌ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ నాలుగు రోజుల కాన్సెప్ట్‌‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రికెట్‌‌ ఆస్ట్రేలియా చీఫ్ కెవిన్‌‌ రాబర్ట్‌‌, టెస్ట్‌‌ కెప్టెన్ టీమ్‌‌ పైన్​  అభిప్రాయపడ్డారు. 
 

అయితే ఈ నిర్ణయం భావోద్వేగంగా కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు.  ఐదు రోజుల టెస్ట్‌‌లతో ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా కష్టపడాల్సి వస్తుందని పైన్ చెప్పుకొచ్చాడు. నాలుగు రోజుల టెస్టుకు ఇంకా చాలారోజులు పడుతుందని దీనిపై ఇప్పుడే స్పందిస్తే తొందరపాటే అవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ‘ముందు ప్రతిపాదన రానివ్వండి. రాకముందే వ్యాఖ్యానించడం తగదు’ అని చెప్పాడు.