Pakistan : భార‌త్ వ‌ర్సెస్‌ పాక్ మ్యాచ్ పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌.. యూట్యూబ‌ర్‌ను కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు

మ్యాచ్‌కు ముందు ప్ర‌జాభిప్రాయాల‌ను సేక‌రిస్తున్న ఓ యూట్యూబ‌ర్‌ను సెక్యూరిటీ గార్డు కాల్చి చంపాడు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో చోటు చేసుకుంది.

Pakistan : భార‌త్ వ‌ర్సెస్‌ పాక్ మ్యాచ్ పై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌.. యూట్యూబ‌ర్‌ను కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు

Guard in Pakistan shoots YouTuber dead for asking questions on IND vs PAK

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో భాగంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో ఆదివారం భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ్యాచ్ జ‌రిగింది. స్వ‌ల్ప స్కోర్లు న‌మోదైన ఈ మ్యాచ్‌లో భార‌త్ 6 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. కాసేపు మ్యాచ్ సంగ‌తి ప‌క్క‌న బెటితే ఓ దిగ్భ్రాంతికర సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఈ మ్యాచ్‌కు ముందు ప్ర‌జాభిప్రాయాల‌ను సేక‌రిస్తున్న ఓ యూట్యూబ‌ర్‌ను సెక్యూరిటీ గార్డు కాల్చి చంపాడు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో చోటు చేసుకుంది.

సాద్ అహ్మద్ అనే యూట్యూబర్ భార‌త్‌, పాక్ మ్యాచ్ సంబ‌ధించి ప్ర‌జాభిప్రాయాన్ని సేక‌రించాల‌ని భావించాడు. క‌రాచీలోని మొబైల్ మార్కెట్‌కు వెళ్లాడు. అక్క‌డ ప‌లువురు షాప్ య‌జ‌మానుల నుంచి వీడియో బైట్‌ల‌ను తీసుకున్నాడు. అక్క‌డే ఉన్న సెక్యూరిటీ గార్డు అభిప్రాయాన్ని తీసుకోవాల‌ని భావించాడు. అత‌డిని ప‌లు ప్ర‌శ్న‌లు అడిగాడు. అయితే.. ఇందుకు స‌ద‌రు సెక్యూరిటీ గార్డు ఇష్ట‌ప‌డ‌లేదు.

Shahid Afridi : షాహిద్ అఫ్రిది సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. పాక్ జ‌ట్టును నాశ‌నం చేస్తుంది ఎవ‌రంటే..?

యూట్యూబ‌ర్ బ‌ల‌వంతం చేయ‌డంతో త‌న వ‌ద్ద నున్న తుపాకీతో అహ్మ‌ద్ పై కాల్చులు జ‌రిపాడు. వెంట‌నే అక్క‌డ ఉన్న వారు అతడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే అత‌డు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు స‌ద‌రు గార్డును అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. కాగా.. అత‌డు మైక్‌ను ముఖానికి ద‌గ్గ‌ర‌గా ఉంచి, చిత్రీక‌రిస్తుండడంతో తాను స‌హ‌నం కోల్పోయాన‌ని, అందుక‌నే కాల్పులు జ‌రిపిన‌ట్లు గార్డు చెప్పిన‌ట్లుగా మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

కాగా.. యూట్యూబ‌ర్ సాద్ కుటుంబం అత‌డి సంపాద‌న‌పై ఆధాప‌డి జీవిస్తోంద‌ని మృతుడి స్నేహితుడు చెప్పాడు. అత‌డికి వివాహ‌మైంద‌ని, ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు ఉన్నార‌ని చెప్పారు.

MS Dhoni : పారిస్ వీధుల్లో ఫ్యామిలీతో చ‌క్క‌ర్లు కొడుతున్న ధోని..