ICC Mens T20 World Cup 2026: చెలరేగిన సంజూ.. భారత్ భారీ స్కోర్.. ఇంగ్లండ్ టార్గెట్ ఎంతంటే
భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ మరోసారి రాణించాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు.
Pic Courtesy @ EspnCricInfo
ICC Mens T20 World Cup 2026: రెండో సెమీఫైనల్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ముందు 254 పరుగుల టార్గెట్ ఉంచింది. భారత బ్యాటర్లలో సంజూ శాంసన్ మరోసారి రాణించాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. శివమ్ దూబె (43), ఇషాన్ కిషన్ (39) రాణించారు. చివరలో హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) ధనాధన్ బ్యాటింగ్ చేశారు. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.
