ఆస్ట్రేలియా పర్యటనకు ఇండియా జట్టు ఇదే.. రోహిత్ అవుట్- జట్టులోకి సిరాజ్

ఆస్ట్రేలియా పర్యటనకు ఇండియా జట్టు ఇదే.. రోహిత్ అవుట్- జట్టులోకి సిరాజ్

BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సోమవారం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న జట్టును ప్రకటించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌కు 18మంది ప్లేయర్ల పేర్లను ప్రకటించింది. ఐపీఎల్‌లో ఆడుతున్న ఇండియా-ఆస్ట్రేలియా ప్లేయర్లు సీజన్ ఫైనల్ మ్యాచ్ అయిపోయిన రెండో రోజే ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంది.

ఇండియన్ సెలక్షన్ కమిటీకి సునీల్ జోషి నాయకత్వం వహిస్తున్నారు. కరోనావైరస్, గాయాలను దృష్టిలో ఉంచుకుని ప్లేయర్ల పేర్లను ప్రకటించారు. టెస్టు స్పెషలిస్టులు చతేశ్వర్ పూజారా, హనుమ విహారీతో పాటు ఇండియా కోచింగ్ స్టాఫ్ యూఏఈలో సోమవారం ల్యాండ్ అయ్యారు.



ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న ఇండియన్ ప్లేయర్లను బయటనుంచి పిలిచి బయో సెక్యూర్ బబుల్ లోకి ఉంచుతారు. ఆ తర్వాత మాత్రమే మూడు ఫార్మాట్లకు సెట్ అయ్యే ప్లేయర్ల పేర్లు అనౌన్స్ చేస్తారు. ఈ టూర్ కు వెళ్లేందుకు జంబో స్క్వాడ్ ను ప్రకటించింది సెలక్షన్ కమిటీ.

మొత్తం టెస్టు స్క్వాడ్: Virat Kohli (Capt), Mayank Agarwal, Prithvi Shaw, KL Rahul, Cheteshwar, Ajinkya(vc), Hanuma Vihari, Shubman Gill, Saha (wk), Rishabh Pant (wk), Bumrah, Mohd. Shami, Umesh Yadav, Navdeep Saini, Kuldeep Yadav, Ravindra Jadeja, R. Ashwin, Mohd. Siraj

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయిన తర్వాతనే ఈ సిరీస్ మొదలవుతుంది. నవంబరు 27, 29 తేదీల్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా మ్యాచ్ లు జరుగుతాయి. మూడో వన్డే, తొలి టీ20మానుకా ఓవల్ నిర్వహిస్తారు. మళ్లీ తిరిగి సిడ్నీ వచ్చి రెండు టీ20లు పూర్తి చేస్తారు.

ఆస్ట్రేలియా వెళ్లనున్న ఇండియా షెడ్యూల్:
మొదటి టెస్టు: డిసెంబర్ 17-21 — Adelaide Oval
రెండో టెస్టు: డిసెంబర్ 26-31 — Melbourne Cricket Ground
మూడో టెస్టు: జనవరి 7- 11 — Sydney Cricket Ground
నాలుగో టెస్టు: జనవరి 15-19 — Brisbane