Ind Vs Eng: చెలరేగిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ ఆలౌట్.. టీమిండియాకు ఈజీ టార్గెట్..!
4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాడు.

Ind Vs Eng: ఇంగ్లాండ్ తో మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు చెలరేగారు. అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో నాలుగో రోజు ఆటలో ఊహించని విధంగా 62.1 ఓవర్లలో 192 పరుగులకే ఇంగ్లీష్ జట్టు ఆలౌట్ అయ్యింది. ఆ జట్టులు జో రూట్ హయ్యస్ట్ స్కోరర్. అతడు 40 పరుగులు చేశాడు.
బెన్ స్టోక్స్ 33 పరుగులు, హ్యారీ బ్రూక్ 23 పరుగులు, క్రాలీ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ సత్తా చాటాడు. 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాడు. సిరాజ్, బుమ్రా తలో రెండు వికెట్లు తీశారు. నితీశ్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే 192 పరుగులు చేయాలి.
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ కూడా తన తొలి ఇన్నింగ్స్ లో సరిగ్గా అదే స్కోర్ (387) కు ఆలౌట్ అయ్యింది.