ఐపిఎల్ 2020: కోవిడ్ -19 పరీక్షల సెకెండ్ రౌండ్ క్లియర్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. నెట్స్‌లో ఎంఎస్ ధోని

  • Published By: vamsi ,Published On : September 5, 2020 / 10:37 AM IST
ఐపిఎల్ 2020: కోవిడ్ -19 పరీక్షల సెకెండ్ రౌండ్ క్లియర్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. నెట్స్‌లో ఎంఎస్ ధోని

Updated On : September 5, 2020 / 11:06 AM IST

కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో సహా మిగిలిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ళు శుక్రవారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా కరోనా సోకిన దీపక్ చాహర్, రితురాజ్ గైక్వాడ్ మినహా మిగతా ఆటగాళ్లందరూ ఆటకు సిద్ధం అవుతున్నారు. ఈ ఆటగాళ్లంతా దుబాయ్‌లో మూడో రౌండ్ కరోనా పరీక్షలను పూర్తి చేశారు.



గతవారం మరో 11 మంది సభ్యులతో పాటు దీపక్, రితురాజ్‌లకు కరోనా పాజిటివ్‌కు వచ్చిన తరువాత, జట్టు ప్రాక్టీస్ షెడ్యూల్‌కు కాస్త విరామం ఇచ్చారు. దీని తరువాత జరిగిన మూడు పరీక్షలు 6 రోజుల వ్యవధిలో జరిగాయి. ఈ బృందం ఆగస్టు 21 న దుబాయ్ చేరుకుంది.





సిఎస్‌కె సీఈఓ సిఎస్ విశ్వనాథన్ మాట్లాడుతూ.. 13 మంది మినహా మిగతా వారందరికీ మూడోసారి నెగెటివ్ వచ్చినట్లు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారు రెండు వారాలు తర్వాత మాత్రమే మళ్లీ పరీక్షించబడతారు.

జట్టులో చాలా మంది సభ్యులు కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత, రైనా మరియు హర్భజన్ వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో జట్టు చాలా పెద్ద ఎదురుదెబ్బలను ఎదుర్కొంది. సెప్టెంబర్ 19 న ఐపీఎల్ ప్రారంభం కానుంది.

 

View this post on Instagram

 

Thala keeping drills

A post shared by Chennai Super Kings (@chennaiipl) on