Courtesy BCCI
IPL 2025: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 టోర్నీని వారంరోజులపాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీలో ఇప్పటి వరకు 58 మ్యాచ్ లు పూర్తయ్యాయి. మే8న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 59వ మ్యాచ్ అర్ధంతరంగా నిలిచిపోయింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం రాత్రి పఠాన్కోట్ నగరంలో పాకిస్థాన్ వైమానిక దాడులకు యత్నించింది. దీంతో సైరన్లు మోగడంతో మధ్యలోనే అర్ధంతరంగా మ్యాచ్ ను నిలిపివేశారు. మరుసటిరోజే బీసీసీఐ ఐపీఎల్ ను వారం రోజులు వాయిదా వేసింది.
బీసీసీఐ నిర్ణయం తరువాత ప్రాంచైజీలు మిగిలిన మ్యాచ్ లకు టికెట్ రీఫండ్ లను చేయడంపై దృష్టిపెట్టాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు శనివారం తన సొంతమైదానంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగే మ్యాచ్ కు సంబంధించిన టికెట్లకు రీఫండ్ లను త్వరలోనే ప్రారంభిస్తామని తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది.
𝐔𝐏𝐃𝐀𝐓𝐄:
In light of the current situation, #TATAIPL2025 has been suspended with immediate effect. Ticket refund details will be communicated shortly. pic.twitter.com/Gw2Qs3FZG0
— SunRisers Hyderabad (@SunRisers) May 9, 2025
లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కూడా టికెట్ల రీఫండ్ పై ప్రకటన చేసింది. మే9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరగాల్సిన మ్యాచ్ కు సంబంధించిన టికెట్లకు రీఫండ్ వివరాలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొంది. ‘‘ఎకానా క్రికెట్ స్టేడియంలో 9వ తేదీ రాత్రి జరగాల్సిన మ్యాచ్ రద్దు చేయబడింది. టికెట్ రీఫండ్ లకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేస్తాము’’ అని ఫ్రాంచైజీ పోస్టు చేసింది.
Update: Tonight’s match at BRSABV Ekana Cricket Stadium has been cancelled. Details regarding ticket refunds will follow. pic.twitter.com/AQlMt4M0z4
— Lucknow Super Giants (@LucknowIPL) May 9, 2025
ఐపీఎల్ టోర్నీని మరో వారంరోజుల్లో పున:ప్రారంభిస్తామని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల ముధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పట్లో టోర్నీ పున: ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు.