IPL2021 : చెన్నై విజయోత్సాహం.. వైరల్ వీడియో
ధోని సారథ్యంలోని చెన్నై జట్టు నాలుగవ సారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో చెరిగిన ఫైనల్ మ్యాచ్లో 27 పరుగుల తేడాతో విజయం సాదించింది చెన్నై
IPL2021 : ధోని సారథ్యంలోని చెన్నై జట్టు నాలుగవ సారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో చెరిగిన ఫైనల్ మ్యాచ్లో 27 పరుగుల తేడాతో విజయం సాదించింది చెన్నై. మొదట బ్యాటింగ్కి దిగిన చెన్నై 192 పరుగులు చేసింది. 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో చెన్నై అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. విజయ దశమినాడు విజిల్ పోడూ అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. విజయం అనంతరం ధోని సేన సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
విజయం అనంతరం చెన్నై ఆటగాళ్లు గ్రౌండ్లో కేరింతలు కొట్టారు. ఇక పోడియంలోని అభిమానుల సంబరాలకు అవధులు లేకుండా పోయాయి. ధోని సతీమణి సాక్షి చప్పట్లు కొడుతూ ఎంజోయ్ చేయగా కూతురు జీవి ఆశ్చర్యంతో గ్రౌండ్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఈ సీజన్ తర్వాత ధోని సీఎస్కే కెప్టెన్గా కొనసాగుతాడా లేదంటే, ఇతర బాధ్యతలు చేపడతాడా అన్న సందేహాల నేపథ్యంలో అనివార్యమైన ఈ విజయాన్ని అభిమానులు పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.
Fantastic FOUR! ? ? ? ?
The @msdhoni-led @ChennaiIPL beat #KKR by 27 runs in the #VIVOIPL #Final & clinch their 4⃣th IPL title. ? ? #CSKvKKR
A round of applause for @KKRiders, who are the runners-up of the season. ? ?
Scorecard ? https://t.co/JOEYUSwYSt pic.twitter.com/PQGanwi3H3
— IndianPremierLeague (@IPL) October 15, 2021
The winning moment.! Ft. Super Fam.!#WhistlePodu #Yellove #SuperCham21ons ?? pic.twitter.com/7uHH5fJ5N5
— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) October 15, 2021