KXIPvsSRH: పంజాబ్‌ టార్గెట్ 213

ప్లే ఆఫ్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 213 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

KXIPvsSRH: పంజాబ్‌ టార్గెట్ 213

Updated On : April 29, 2019 / 4:20 PM IST

ప్లే ఆఫ్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 213 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

ప్లే ఆఫ్ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పట్టుదల కనబరచింది. ఈ క్రమంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు 213 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఓపెనర్‌గా దిగిన డేవిడ్ వార్నర్(81; 56 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సులు)తో విజృంభించాడు. జట్టుకు తానొక్కడే హైస్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన ప్లేయర్లు పరవాలేదనిపించే స్కోరు చేయడంతో 212 పరుగులు చేయగలిగారు. 

వృద్ధిమాన్ సాహా(28; 13 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు), మనీశ్ పాండే(36; 25బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సు), మొహమ్మద్ నబీ(20), కేన్ విలియమ్సన్(14), రషీద్ ఖాన్(1), విజయ్ శంకర్(7), అభిషేక్ శర్మ(5)పరుగులు చేయగలిగారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, మురుగన్ అశ్విన్ చెరో వికెట్ తీయగా, మొహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ తలో 2వికెట్లు పడగొట్టారు.