KXIPvsSRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

KXIPvsSRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

Updated On : April 29, 2019 / 2:07 PM IST

ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న 48వ మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా ప్లే ఆఫ్‌ బెర్త్ కన్ఫార్మ్ చేసుకునేందుకు హైదరాబాద్.. పంజాబ్ లు హోరాహోరీగా తలపడనున్నాయి. టాస్ గెలిచిన అనంతరం పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ.. మ్యాచ్‌ల మధ్య దక్కిన విరామం మాకు కొత్త శక్తిని ఇచ్చింది. జట్టులో 3కీలక మార్పులతో బరిలోకి దిగుతున్నాం. ప్రభ్‌మన్ సింగ్ మ్యాచ్‌తో అరంగ్రేటం చేయనున్నాడు. ముజీబ్ మరోసారి అడుగుపెడుతున్నాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే మేం కూడా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నాం. డేవిడ్ వార్నర్ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. అతడి నుంచి మరింత ఆశిస్తున్నాం. ప్రతి జట్టు పాయింట్ల కోసం పోరాడుతుంది. దాంతో పాటు చక్కటి ప్రదర్శన కూడా చేయాల్సి ఉంది. జట్టులో మేం కూడా 3మార్పులు చేశాం. అభిషేక్, మొహమ్మద్ నబీ, సందీప్ తుది జట్టులో  స్థానం దక్కించుకున్నారు. 

ఇరు జట్లు:
Sunrisers Hyderabad: David Warner, Kane Williamson(c), Manish Pandey, Vijay Shankar, Mohammad Nabi, Wriddhiman Saha(w), Abhishek Sharma, Rashid Khan, Bhuvneshwar Kumar, K Khaleel Ahmed, Sandeep Sharma

Kings XI Punjab : Lokesh Rahul, Chris Gayle, Mayank Agarwal, David Miller, Nicholas Pooran(w), Simran Singh, Ravichandran Ashwin(c), Murugan Ashwin, Mohammed Shami, Arshdeep Singh, Mujeeb Ur Rahman