Malaysia Open 2024 : చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడి.. మలేషియా ఓపెన్లో ఫైనల్కు
భారత బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి అద్భుత ప్రదర్శన చేశారు.
Malaysia Open 2024 : భారత బ్యాడ్మింటన్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి – చిరాగ్ శెట్టి అద్భుత ప్రదర్శన చేశారు. కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేషియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్ లో ఫైనల్కు చేరుకున్నారు. ఈ క్రమంలో మలేషియా ఓపెన్ డబుల్స్లో ఫైనల్కు చేరుకున్న మొదటి భారత జోడిగా చరిత్ర సృష్టించారు.
సెమీ ఫైనల్లో దక్షిణ కొరియా జోడి కాంగ్ మిన్ హ్యూక్ – సియో సెయుంగ్ పై 21-18, 22-20 తేడాతో గెలుపొందారు. ప్రస్తుతం ప్రపంచ నం.2 ర్యాంక్లో ఉన్న డైనమిక్ ద్వయం 2023 నుండి వారి అసాధారణమైన ఫామ్ను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఆరు టైటిళ్లను సొంతం చేసుకున్నారు.
Arjun Tendulkar : దమ్మురేపిన సచిన్ కొడుకు.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అర్జున్ టెండూల్కర్
గతేడాది ఇదే టోర్నీలో సెమీస్లో ఓడినప్పటికీ ఈ సారి మాత్రం పట్టువీడలేదు. 44 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచులో అద్భుతంగా పోరాడారు. రెండో సెట్లో ఓ దశలో 11-18తో వెనుక బడినప్పటికీ కూడా అనూహ్యంగా పుంజుకున్నారు.తమదైన శైలిలో షాట్లు ఆడుతూ సెట్తో పాటు మ్యాచ్ను గెలుచుకున్నారు.
ఇక రెండో సెమీస్ మ్యాచ్ లో చైనాకు చెందిన వాంగ్-లియాంగ్, జపాన్కు చెందిన కొబయాషి-హోకి జోడీల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన వారితో భారత ద్వయం ఫైనల్ మ్యాచులో తలపడనుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
𝐅𝐢𝐧𝐚𝐥𝐬 𝐂𝐚𝐥𝐥𝐢𝐧𝐠 😍😍
First Indians to enter Malaysia Open final, well done boys! 👏
📸: @badmintonphoto #MalaysiaOpen2024#IndiaontheRise#Badminton pic.twitter.com/TDJZSbN9WT
— BAI Media (@BAI_Media) January 13, 2024