MS Dhoni : ఆహారం కోసం పాకిస్తాన్‌కు వెళ్లండి.. అభిమానికి ధోని స‌ల‌హా..! వీడియో వైర‌ల్‌

భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

MS Dhoni : ఆహారం కోసం పాకిస్తాన్‌కు వెళ్లండి.. అభిమానికి ధోని స‌ల‌హా..! వీడియో వైర‌ల్‌

MS Dhoni Suggestion

MS Dhoni Suggestion : భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనికి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మ‌హేంద్రుడు ఏదైన స‌ల‌హా ఇస్తే అభిమానులు చేయ‌కుండా ఉండ‌రు. అయితే.. ధోని ఇచ్చిన ఓ స‌ల‌హాను ఓ ఫ్యాన్ పూర్తిగా తిర‌స్క‌రించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

త‌న క్రికెట్ కెరీర్‌లో కొన్ని సార్లు ధోని పాకిస్తాన్‌లో ప‌ర్య‌టించాడు. ఆ సంద‌ర్భంలో అక్క‌డి వంట‌కాల‌ను రుచి చూశాడు. ఆ సంద‌ర్భంలో వాటిని ప్ర‌శంసించాడు కూడా. అక్క‌డి ఆహారం త‌న‌కు న‌చ్చుతుంద‌ని చెప్పాడు. కాగా.. తాజా వీడియోలో ధోని ఓ హోట‌ల్ రిసెప్ష‌న్ వ‌ద్ద నిల‌బ‌డి ఉన్నాడు. డెస్క్ వ‌ద్ద ఉన్న వ్య‌క్తితో మాట్లాడుతున్నాడు.

Team India : భార‌త్ అంటే చాలు రెచ్చిపోయి ఆడే ఆట‌గాళ్లు ఎవ‌రో తెలుసా..?

ఈ క్ర‌మంలో ఆహారం కోసం ఒక‌సారి పాకిస్తాన్ కు వెళ్ల‌మ‌ని స‌ద‌రు వ్య‌క్తికి ధోని స‌ల‌హా ఇచ్చాడు. అయితే.. ధోని ఇచ్చిన స‌ల‌హాను అత‌డు సున్నితంగా తిర‌స్క‌రించాడు.. ‘మీరు మంచి ఆహారాన్ని సూచించినప్పటికీ నేను అక్క‌డ‌కి వెళ్ల‌ను. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయినా నేను అక్క‌డికి వెళ్ల‌ను.’ అంటూ చెప్పాడు.

ఇక 2020 ఆగ‌స్టు 15న ధోని అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) మాత్ర‌మే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ధోని ఆ జ‌ట్టుకు ఐదు టైటిళ్లు అందించాడు.

Team India : ద‌క్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం.. యువ పేసర్‌కు లక్కీఛాన్స్.. అరంగ్రేటం ప‌క్కా..!

ఐపీఎల్ 2023 సీజ‌న్ అనంత‌రం మోకాలికి శ‌స్త్ర చికిత్స చేయించుకున్న ధోని ప్ర‌స్తుతం కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్ ధోనికి ఆఖ‌రిది అని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. దీనిపై ఇంత వ‌ర‌కు ధోని స్పందించ‌లేదు.