MS Dhoni : ఐపీఎల్ రిటైర్మెంట్పై ఎంఎస్ ధోని కీలక ప్రకటన..
నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది.

PIC Credit @csk
MS Dhoni : ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రచారంపై ఎంఎస్ ధోని స్పందించాడు. ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ ప్రకటించనని, ఐపీఎల్ లో ఇంకా ఆడతానని స్పష్టం చేశాడు. తన రిటైర్మెంట్ ను నిర్ణయించాల్సింది తన శరీరం అన్నాడు. ఇక చాలు అనిపించేంత వరకు తాను ఆడతానని ధోని స్పష్టం చేశాడు. ఐపీఎల్ లో ధోని రిటైర్ అవుతారని రెండు రోజులుగా ప్రచారం జరిగింది.
నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్రచారం జరిగింది. ఆ మ్యాచ్ ను చూసేందుకు ధోని తల్లిదండ్రులు స్టేడియంకు రావడంతో ఆ ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే, మ్యాచ్ తర్వాత ధోని ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన ధోని.. ఇప్పట్లో తనకు అలాంటి ఉద్దేశమే లేదని క్లారిటీ ఇచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని రిటైర్ మెంట్ పై మళ్లీ ఊహాగానాలు రావడానికి కారణం లేకపోలేదు. ఫస్ట్ టైమ్.. ధోని తల్లిదండ్రులు మ్యాచ్ చూసేందుకు స్టేడియంకి వచ్చారు. అంతే, ఒక్కసారిగా ఐపీఎల్ లో ధోని రిటైర్ మెంట్ గురించి చర్చ మొదలైంది. ఢిల్లీతో మ్యాచ్ తర్వాత రిటైర్ మెంట్ పై ధోని ప్రకటన చేస్తారనే వార్తలు హల్ చల్ చేశాయి.
Also Read : వరుస ఓటములు.. అభిమానులపై దాడికి యత్నించిన పాక్ క్రికెటర్.. వీడియో వైరల్.. స్పందించిన పీసీబీ
శనివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లో అరుదైన దృశ్యం కనిపించింది. ఎప్పుడూ పెద్దగా బయట కనిపించని ఎంఎస్ ధోనీ తల్లిదండ్రులు ఫస్ట్ టైమ్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ చూశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ మ్యాచ్ లో ధోనీ పేరెంట్స్ హైలైట్ గా నిలిచారు.
సాధారణంగా ధోనీ తల్లిదండ్రులు పాన్సింగ్, దేవకీదేవీ మ్యాచ్లు చూసేందుకు ఎప్పుడూ బయటకు వచ్చింది లేదు. అలాంటిది సడెన్ గా స్టేడియంలో కనిపించి ధోని అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. అంతే, ధోనీ రిటైర్మెంట్ గురించి మళ్లీ ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. గత సీజన్లోనూ ఇదే తరహా ప్రచారం నడిచింది.
Also Read : పాక్-కివీస్ మ్యాచ్.. బాల్ వేస్తుండగా పవర్ కట్.. పాక్ బ్యాటర్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
అయితే, ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ధోనీ 18వ సీజన్లోనూ ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ తన ఫ్రాంచైజీ అని, సీఎస్ కే తరపున మరింత కాలం ఆడాలని అనుకుంటున్నట్లు తన మనసులో మాట చెప్పాడు ధోని. ధోని చివరిసారిగా 2023లో సీఎస్ కే కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సీజన్లో అద్భుత ప్రదర్శనతో జట్టుని విజేతగా నిలిపాడు. ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపి.. ఎక్కువసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై సరసన చెన్నై సూపర్ కింగ్స్ ని నిలిపాడు ధోనీ.