BCCI ఆధ్వర్యంలో ప్రతి ఏడాది జరిగే IPL కరోనా కారణంగా ఈ ఏడాది భారత్లో జరిగే అవకాశం కనిపించకపోడంతో… ఐపీఎల్ 2020 సీజన్ని విదేశాల్లోనూ నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. అయితే ఇప్పటికే ఐపీఎల్కు ఆతిథ్యమిచ్చేందుకు తాము సిద్ధమని యూఏఈ, శ్రీలంక దేశాలు ముందుకు రాగా.. తాజాగా ఈ జాబితాలోకి న్యూజిలాండ్ కూడా చేరింది.
బీసీసీఐ ముందుకొస్తే ఐపీఎల్కు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని న్యూజిలాండ్ తెలిపింది. న్యూజిలాండ్లో కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో టోర్నీ నిర్వహించేందుకు ఆ దేశం ముందుకొచ్చింది.
దీనిపై బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. IPL టోర్నీని ఇండియా నిర్వహించాలనే మా మొదటి ప్రాధాన్యత. ఇక్కడ సాధ్యం కాని పరిస్థితుల్లో విదేశాల్లో నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తాం. యూఏఈ, శ్రీలంక తర్వాత న్యూజిలాండ్ కూడా తమ దేశంలో ఐపీఎల్ నిర్వహణకు ఆసక్తి చూపుతోంది. భాగస్వాములందరితోనూ సమావేశమై నిర్ణయం తీసుకుంటాం. ఆటగాళ్ల భద్రతే అన్నింటికన్నా ముఖ్యమైనది. ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. కాగా గతంలోనూ పలుసార్లు ఐపీఎల్ టోర్నీని విదేశాల్లో నిర్వహించారు.