IPL Final 2025: టాస్ గెలిచినోళ్లదే కప్..! ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ ఫైనల్స్ లో ఏం జరిగిందంటే..

ఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్.

IPL Final 2025: టాస్ గెలిచినోళ్లదే కప్..! ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ ఫైనల్స్ లో ఏం జరిగిందంటే..

Courtesy BCCI

Updated On : June 3, 2025 / 8:42 PM IST

IPL 2025: ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇవాళ్టితో తెరపడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్.

లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, బెంగళూరు.. ఫైనల్ చేరే క్రమంలోనూ తమదైన ముద్ర వేశాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ, నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్ పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటికే మూడుసార్లు తలపడ్డాయి.

ఇక ఐపీఎల్ హిస్టరీలో గణాంకాలను ఓసారి పరిశీలిస్తే.. ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఇప్పటి వరకు జరిగిన 17 ఐపీఎల్ ఫైనల్స్ లో టాస్ గెలిచిన జట్లే ఎక్కువసార్లు గెలిచాయి. ఇప్పటివరకు 10 సార్లు అలానే జరిగింది. మరి ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో ఏం జరగనుంది అనేది ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచిన సంగతి తెలిసిందే. గత గణాంకాలను గుర్తు చేసుకుంటూ పంజాబ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ లెక్కన ఈసారి గెలుపు మాదే అని ధీమాగా ఉన్నారు.