IPL 2024 : బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..! ధోని క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు?
ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది
![IPL 2024 : బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..! ధోని క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు? IPL 2024 : బ్లాక్ మార్కెట్లో ఐపీఎల్ టికెట్లు..! ధోని క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్నారు?](https://10tv.in/wp-content/uploads/2024/04/Selling-IPL-tickets-in-black-market-in-uppal.jpg)
Selling IPL tickets in black market in uppal
ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్కు రంగం సిద్ధమైంది. శుక్రవారం రాత్రి ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలని ఎంతో మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్లు అందించిన ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతుండడం ఓ కారణం అయితే.. విశాఖలో మహీ మెరుపులు మరో కారణం. దీంతో ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
ఎంతో మంది మ్యాచ్ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారికి నిరాశే ఎదురవుతోంది. ఆన్లైన్లో ఉంచిన టికెట్లు నిమిషాల్లోనే అమ్ముడుపోయినట్లు చూపిస్తుండడంతో అభిమానులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దీన్ని అదునుగా భావించి బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. వెయ్యి రూపాయల టికెట్ను ఆరు వేలకు పైనే విక్రయిస్తున్నట్లుగా పలువురు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
Suryakumar Yadav : సునీల్ నరైన్.. కాస్త నవ్వవయ్యా బాబు : సూర్యకుమార్
ఐపీఎల్ టికెట్లు పక్కదారి పడుతున్నాయని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైట్లోకి రాకముందే బ్లాక్ మార్కెట్లోకి వెళ్తున్నాయని అంటున్నారు. టికెట్లు బుక్ చేసుకునేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా క్షణాల్లో టికెట్లు మాయమవుతున్నాయని అంటున్నారు.
చాలా తక్కువ సంఖ్యలో ఆన్లైన్లో టికెట్లు అమ్మినట్లుగా సోషల్ మీడియాలో ఆరోపణలు వస్తున్నాయి. కాగా..మునుపెన్నడూ లేని రీతిలో బ్లాక్ టికెట్ల దందా ఈసారి జరిగిందని అంటున్నారు. ధోనీ క్రేజ్ ను బాగా సొమ్ము చేసుకుంటున్నారు. కాగా..ఈ సీజన్ ఐపీఎల్ టికెట్ల అమ్మాకాన్ని పేటీఎంకు బీసీసీఐ అప్పగించిన సంగతి తెలిసిందే.
SRH vs CSK: ఉప్పల్లో ఆసక్తికర పోరు.. సన్రైజర్స్ హైదరాబాద్పై భారీగా అంచనాలు