COVID-19 : ప్రతొక్కరూ ఇంట్లోనే ఉండండి..రవీంద్ర జడేజా వీడియో సందేశం
ప్రతొక్కరూ ఇంట్లోనే ఉండండి..సురక్షితంగా ఉండాలని టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా..వీడియో సందేశం ఇచ్చారు.
Stay Safe : ప్రతొక్కరూ ఇంట్లోనే ఉండండి..సురక్షితంగా ఉండాలని టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా..వీడియో సందేశం ఇచ్చారు. భారతదేశంలో కరోనా సెకండ వేవ్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..జడేజా ఓ వీడియో సందేశం ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉంటే..కరోనాను జయించే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
మాస్క్ లు కంపల్సరీ ధరించాలని, అలాగే చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంట్లోనే ఉంటూ..ఇతరులను కూడా ఈ కరోనా వైరస్ నుంచి జయించవచ్చని తెలిపారు. అలాగే..అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలని, చొరవ తీసుకుని సహాయం చేయాలని పిలుపునిచ్చారాయన. ఈయన చేసిన ఈ వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది. కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్ లపై పడింది. పలువురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ ను వాయిదా వేశారు. దీంతో టీం సభ్యులు వారి వారి స్వస్వలాలకు వెళ్లిపోయారు.
Read More : Covid Blood clots: ‘చాలా కొవిడ్ కేసుల్లో ఐదో రోజు నుంచే రక్తం గడ్డ కడుతుంది’
We are one and we shall overcome as one!
Kindly #StayHomeStaySafe .#MaskPodu #Yellove ?? @imjadeja pic.twitter.com/EHi1CYifbX— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) May 7, 2021