T20 World Cup 2021 : టీమిండియా టార్గెట్ 133
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా భారత్, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.

T20 World Cup 2021 India Target
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 లో భాగంగా భారత్, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత్ ముందు 133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
నమీబియా బ్యాటర్లలో డేవిడ్ వీస్ 26, స్టెఫాన్ బార్డ్ 21 రాణించారు. మిగిలిన బ్యాటర్లెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు. షమీ వేసిన చివరి ఓవర్లో నమీబియా 13 పరుగులు రాబట్టింది.