IPL 2024 : ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే అవుట్ అయినా.. సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

Virat Kohli
Virat Kohli New Record : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో సీఎస్కే జట్టు విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలుత క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా కొద్దిసేపటికే దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.. ఈ క్రమంలో 21 వ్యక్తిగత పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కోహ్లీ తక్కువ పరుగులకే అవుట్ అయినా.. ఈ మ్యాచ్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
Also Read : IPL 2024 : పది బంతుల్లోనే ఆర్సీబీని దెబ్బతీసిన బంగ్లాదేశ్ పేసర్.. మొన్న అలా.. నేడు ఇలా..! ఫొటోలు వైరల్
విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కెరీర్ లో 12వేల పరుగులు పూర్తిచేశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. 35ఏళ్ల విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో క్రిస్ గేల్ (14,562), షోయబ్ మాలిక్ (13,260), కీరన్ పోలార్డ్ (13,360), అలెక్స్ హేల్స్ (12,319), డేవిడ్ వార్నర్ (12,065) తరువాత ఈ మైలురాయిని చేరుకున్న ప్రపంచంలోనే ఆరో ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. సీఎస్కేతో మ్యాచ్ లో ఆరు పరుగులు వద్దే కోహ్లీ కొత్త రికార్డును అందుకున్నాడు. ఈ జాబితాలో భారతీయ క్రికెటర్లలో కోహ్లీ తరువాత రోహిత్ శర్మ (11,156) పరుగులు చేశాడు.
Also Read : CSK vs RCB: చెన్నై బోణీ.. బెంగళూరుపై ఘన విజయం
HISTORY AT THE CHEPAUK. ?
Virat Kohli becomes the 1st Indian to score 12,000 runs in T20 cricket. pic.twitter.com/yqxwhJzBy5
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 22, 2024