Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. 28 ఏళ్ల ప్ర‌పంచ రికార్డు బ్రేక్‌..

స్మృతి మంధాన (Smriti Mandhana) అరుదైన ఘ‌న‌త సాధించింది.

Smriti Mandhana : చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన‌.. 28 ఏళ్ల ప్ర‌పంచ రికార్డు బ్రేక్‌..

Womens World Cup 2025 Smriti Mandhana creates history to became first player

Updated On : October 9, 2025 / 4:52 PM IST

Smriti Mandhana : టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ స్మృతి మంధాన అరుదైన ఘ‌న‌త సాధించింది. మ‌హిళ‌ల క్రికెట్‌లో ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2025లో భాగంగా గురువారం ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 12 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద మంధాన (Smriti Mandhana ) ఈ రికార్డు సాధించింది.

ఈ క్ర‌మంలో ఆమె ఆస్ట్రేలియా దిగ్గ‌జ ప్లేయ‌ర్ బెలిండా క్లార్క్‌ను అధిగ‌మించింది. 1997లో బెలిండా మ‌హిళ‌ల అంత‌ర్జాతీయ క్రికెట్‌లో తొలి డ‌బుల్ సెంచ‌రీ సాధించింది. ఆ ఏడాది మొత్తంగా బెలిండా 16 మ్యాచ్‌లు ఆడింది. 14 ఇన్నింగ్స్‌ల్లో 80.83 స‌గ‌టు 98.11 స్ట్రైక్‌రేటుతో 970 ప‌రుగులు సాధించింది. ఇందులో మూడు శ‌త‌కాలు, నాలుగు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 229 నాటౌట్‌.

Mohammed Shami : డోలాయమానంలో షమీ కెరీర్‌.. ‘నా చేతుల్లో ఏమీ లేదు.. ఆ ఇద్ద‌రు క‌రుణించాల్సిందే..’ గిల్‌కు వ‌న్డే కెప్టెన్సీపై కీల‌క వ్యాఖ్య‌లు..

మంధాన‌.. ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్షిణాఫ్రికాతో మ్యాచ్ క‌లుపుకుని 17 ఇన్నింగ్స్‌ల్లో 59.93 స‌గ‌టుతో 113 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేటుతో 971* ప‌రుగులు సాధించింది. ఇందులో నాలుగు శ‌త‌కాలు, మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోరు 135.

మ‌హిళ‌ల క్రికెట్‌లో ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ప్లేయ‌ర్లు వీరే..

* స్మృతి మంధాన (భార‌త్‌) – 972* (2025లో)
* బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) – 970 ప‌రుగులు (1997లో)
* లారా వోల్వార్డ్ట్ (ద‌క్షిణాఫ్రికా) – 882 ప‌రుగులు (2022లో)
* డెబ్బీ హాక్లీ (న్యూజిలాండ్‌) – 880 ప‌రుగులు (1997లో)
* అమీ సాటర్త్‌వైట్ (న్యూజిలాండ్‌) – 853 ప‌రుగులు (2016లో)

ఇక ఈ మ్యాచ్‌లో మంధాన మొత్తంగా 32 బంతులు ఎదుర్కొని ఓ ఫోర్‌, ఓ సిక్స్ సాయంతో 23 ప‌రుగులు చేసింది.

BCCI : ‘టీమ్ ఇండియా’ పేరును ఉపయోగించుకునేందుకు బీసీసీఐకి అధికారం లేదా..? ఢిల్లీ హైకోర్టు ఏమందంటే..?

దీంతో ఓ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో మంధాన సాధించిన మొత్తం ప‌రుగులు 982 ప‌రుగులకు చేరుకుంది. ఈ మెగాటోర్నీలో భార‌త్ ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేప‌థ్యంలో మంధాన ఈజీగా 1000 ప‌రుగుల మైలురాయిని చేరుకునే అవ‌కాశం ఉంది.