Y. S. Sharmila : పార్టీకి ముందే ముసలం-షర్మిల పార్టీలో సభ్యుల రాజీనామాలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో అందించాలనే లక్ష్యంతో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల జూలై8న రాజకీయపార్టీ పెట్టబొతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏర్పాటు కాకముందే పార్టీలో ముసలం పుట్టింది.

Ad Hoc Committee Members Resigned From Ys Sharmila Party
Y.S.Sharmila : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన తెలంగాణలో అందించాలనే లక్ష్యంతో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల జూలై8న రాజకీయ పార్టీ పెట్టబొతున్నట్లు ప్రకటించారు. పార్టీ ఏర్పాటు కాకముందే పార్టీలో ముసలం పుట్టింది.
పార్టీ సంస్ధాగత నిర్మాణం కోసం ఆమె ఇప్పటికే అడ్హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ అడ్హాక్ కమీటీలో ఉన్న కొందరు వైఎస్సార్ అభిమానలు రాజీనామాలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్సార్ అభిమానులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన చెందుతూ దేవరకద్రకు చెందిన కేటీరెడ్డి అడ్హాక్ కమిటీకి రాజీనామా చేశారు. ఇదేబాటలో మరికొందరు సభ్యులు కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇలా ఉండగా.. వైఎస్ షర్మిల రేపు నల్గోండ జిల్లా హుజూర్నగర్ లో పర్యటించనున్నారు. నిరుద్యోగంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్న నీలకంఠసాయి అనే యువకుడిని షర్మిల పరామర్శించనున్నారు. సూసైడ్ చేసుకుని చివరి నిమిషంలో ఆస్పత్రిలో చేర్చటంతో నీలకంఠసాయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. చికిత్స పొంది ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు.