Anchor Shyamala : యాంకర్ శ్యామలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కండిషన్స్ అప్లై

పోలీసులు నోటీసు ఇచ్చి విచారణ కొనసాగించవచ్చంది.

Anchor Shyamala : యాంకర్ శ్యామలకు హైకోర్టులో బిగ్ రిలీఫ్.. కండిషన్స్ అప్లై

Updated On : March 21, 2025 / 8:01 PM IST

Anchor Shyamala : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. శ్యామలను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను ఆదేశించింది కోర్టు. కాగా, పోలీసుల విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సోమవారం నుండి పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని చెప్పింది. పోలీసులు నోటీసు ఇచ్చి విచారణ కొనసాగించవచ్చంది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై తెలంగాణ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన పలువురు సినీ, టీవీ నటులు, యూట్యూబ్ ఇన్‌ఫ్లుయన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో వైసీపీ మహిళా నేత, యాంకర్ శ్యామల కూడా ఉంది. ఈ వ్యవహారంపై ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని శ్యామల తన పిటిషన్ లో పేర్కొంది. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్యామలపై కేసు నమోదైంది. Andhra365 అనే ఆన్ లైన్ గేమింగ్ యాప్ కు యాంకర్ శ్యామల ప్రమోషన్ చేయడం వివాదానికి దారితీసింది.

Also Read : విష్ణుప్రియ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు..! ఒక్కో ప్రమోషన్ కు ఎంత డబ్బు తీసుకుందంటే..

నిషేధిత బెట్టింగ్ యాప్ లకు ప్రచారం చేసిన వ్యవహారం యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్ల నుంచి సినీ ప్రముఖుల దాకా వెళ్లింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నటులు దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్లతో పాటు బుల్లితెర నటి, యాంకర్ శ్యామలపైనా కేసు నమోదైంది.

వీరితోపాటు ఇన్‌ఫ్లుయన్సర్లు, బుల్లితెర నటులు విష్ణు ప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత, శ్రీముఖి, వర్షిణి, సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహాపఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్ తదితరుల పేర్లను పోలీసులు ఎఫ్ఆర్ఐలో చేర్చారు. మియాపూర్ కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Also Read : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో రీతూ చౌదరి.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో విచారణ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పలువురికి నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, విష్ణుప్రియ, రీతూచౌదరిలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు వారి నుంచి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడం ద్వారా డబ్బులు తీసుకున్నట్లు విష్ణుప్రియ అంగీకరించినట్లు సమాచారం.