Balapur Ganesh Laddu Auction 2023: గతేడాది రికార్డు బ్రేక్.. భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎవరు, ఎంత ధరకు దక్కించుకున్నారంటే..

బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ పూర్తయింది. దాసరి దయానంద రెడ్డి భారీ ధరతో లడ్డూను సొంతం చేసుకున్నారు.

Balapur Ganesh Laddu Auction 2023: గతేడాది రికార్డు బ్రేక్.. భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ.. ఎవరు, ఎంత ధరకు దక్కించుకున్నారంటే..

Balapur Ganesh Laddu

Updated On : September 28, 2023 / 11:52 AM IST

Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ వేలం ప్రక్రియ పూర్తయింది. ఈసారి వేలంలో మొత్తం 36 మంది పాల్గొన్నారు. గతేడాది 29 మందికి తోడు కొత్తగా ఏడుగురు వేలంలో పాల్గొన్నారు. ప్రారంభం నుంచి పోటాపోటీగా వేలం ప్రక్రియ కొనసాగింది. చివరకు దాసరి దయానంద రెడ్డి రూ. 27లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూ చరిత్రలోనే ఇది అత్యధిక ధర. గతేడాది లడ్డూ రూ. 24.60లక్షలు పలికింది. తాజాగా ధరతో సరికొత్త రికార్డు నమోదైంది. వేలం పాట సందర్భంగా బాలాపూర్ గణేశ్ వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాలాపూర్ గణపతి ఉత్సవ నిర్వాహకులు దాసరి దయానందరెడ్డికి గణేశ్ లడ్డూను అందజేశారు.

Read Also: Ganesh Laddu Auction: వేలంలో రూ. కోటికిపైగా పలికిన గణేశ్ లడ్డూ.. హైదరాబాద్‌లో ఎక్కడంటే?

1994 నుంచి వేలం ప్రక్రియ..
బాలాపూర్ గణపతి ఉత్సవ సమితి లడ్డూ వేలంపాటను 1994 నుంచి నిర్వహిస్తుంది. అయితే, 2020లో కరోనా కారణంగా లడ్డూవేలం జరగలేదు. మొదటిసారిగా 1994లో లడ్డూవేలం రూ.450తో ప్రారంభమైంది. ప్రతీయేటా వేలంపాట ధర పెరుగుతూ వచ్చింది. 2010 నాటికి వేలంపాటలో లడ్డూ రూ.10.32 లక్షలు పలికింది. గతేడాది (2022) గనేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి రూ.24.60లక్షలకు బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్నాడు.

Read Also: Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణీకులకు శుభవార్త.. అర్థరాత్రి వరకు మెట్రో సేవలు..

మొదటి నుంచి లడ్డూ వేలంలో విజేతలు ..
1994 – కొలను మోహన్ రెడ్డి రూ. 450
1995 – కొలను మోహన్ రెడ్డి రూ.4,500
1996 – కొలను కృష్ణారెడ్డి రూ.18 వేలు
1997 – కొలను కృష్ణారెడ్డి రూ.28 వేలు
1998 – కొలను మోహన్ రెడ్డి రూ.51 వేలు
1999 – కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ.65 వేలు
2000 -కొలను అంజిరెడ్డి రూ.66 వేలు
2001 – జి. రఘునందన్ రెడ్డి రూ.85 వేలు
2002 – కందాడ మాధవరెడ్డి రూ.1,05,000
2003 – చిగిరినాథ బాల్‌రెడ్డి రూ.1,55,000
2004 – కొలను మోహన్ రెడ్డి రూ.2,01,000
2005 – ఇబ్రహీ శేఖర్ రూ.2,08,000
2006 – చిగురింత తిరుపతి రెడ్డి రూ.3లక్షలు
2007 – జి. రఘునాథమ్ చారి రూ.4,15000
2008 – కొలను మోహన్ రెడ్డి రూ.5,07,000
2009 – సరిత రూ.5,10,000
2010 – కొడాలి శ్రీధర్ బాబు రూ.5,35,000
2011 – కొలను బ్రదర్స్ రూ.5,45,000
2012 – పన్నాల గోవర్ధన్ రెడ్డి రూ.7,50,000
2013 – తీగల కృష్ణారెడ్డి రూ.9,26,000
2014 – సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ.9,50,000
2015 – కొలను మధన్ మోహన్ రెడ్డి రూ.10,32,000
2016 – స్కైలాబ్ రెడ్డి రూ.14,65,000
2017 – నాగం తిరుపతిరెడ్డి రూ.15,60,000
2018 – శ్రీనివాస్ గుప్తా రూ. 16,60,000
2019 – కొలను రామిరెడ్డి రూ.17 లక్షల 60 వేలు
2020 – కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దు
2021 – మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ రూ.18 లక్షల 90 వేలు
2022 – వంగేటి లక్ష్మారెడ్డి రూ. రూ.24 లక్షల 60 వేలు

2023 – దాసరి దయానంద్‌రెడ్డి రూ. 27లక్షలు