Khammam : అంబులెన్స్ లో తరలించే స్థోమత లేక..బైక్ పై డెడ్ బాడీ తరలింపు
ఖమ్మం జిల్లా మధిరలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని.. బైక్పైనే ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. గుండెలో నొప్పి రావడంతో.. బంధువులు బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు.
Dead Body Move On Bike : ఖమ్మం జిల్లా మధిరలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో మరణించిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని.. బైక్పైనే ఇంటికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. గుండెలో నొప్పి రావడంతో.. బంధువులు బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్తుండగా వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. అంబులెన్స్లో తరలించే స్థోమత లేక బైక్పైనే మృతదేహాన్ని తీసుకెళ్లారు. కరోనా టైమ్లో అంబులెన్స్ల నిర్వాహకులు అధిక మొత్తంలో వసూలు చేస్తుండటంతో.. సామాన్యులు నానా అవస్థలు పడుతున్నారు.
అనారోగ్యంతో చనిపోయిన ఓ వృద్ధుడిని మోటారు సైకిల్పై కూర్చొబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లిన సంఘటన శుక్రవారం మండలంలోని ఆత్కూరు సమీపంలో చోటు చేసుకుంది. మల్లారానికి చెందిన ఎర్రనాగుల నారాయణ(70)కు సుమారు వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మధిరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో శుక్రవారం గుండెల్లో నొప్పిగా ఉందని అతడు కుటుంబసభ్యులతో కలిసి మోటారు సైకిల్పై మధిరకు వచ్చాడు. సిరిపురం గ్రామంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చూపించుకోగా ఆయన మధిరలోని ఆసుపత్రిలో వైద్యం చేయించుకోమని సూచించాడు. మోటారు సైకిల్పై మధిరకు తీసుకెళ్తుండగా.. ఆత్కూరు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మోటారు సైకిల్పైనే మృతి చెందాడు. అంబులెన్సులో తీసుకెళ్దామంటే వేలాది రూపాయలు కిరాయి అడుగుతున్నారని అదే మోటారుసైకిల్పై ఇంటికి తీసుకెళ్లారు.
Read More : HDFC Bank Fined: హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు కార్ లోన్ కేసులో రూ.10కోట్ల ఫైన్