హైద‌రాబాద్‌లో మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఒకరు మృతి

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి మద్యం మత్తులో కారును డ్రైవ్ చేసి బీభత్సం సృష్టించాడు. కారు పాదాచారులపైకి ..

హైద‌రాబాద్‌లో మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఒకరు మృతి

Car Accident

Car Accident : హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ సాప్ట్ వేర్ ఉద్యోగి మద్యం మత్తులో కారును డ్రైవ్ చేసి బీభత్సం సృష్టించాడు. కారు రోడ్డు క్రాస్ చేస్తున్న వ్యక్తితోపాటు పాదాచారులపైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాయదుర్గంలో చోటు చేసుకుంది. సైబరాబాద్ కమిషనరేట్ ఎదురుగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొనడంతో అతడు చికిత్స పొందుతూ మరణించాడు. స్థానికులు కారును వెంబడించారు. మల్కంచెరువు ప్లైఓవర్ పై కారులోఉన్న సాప్ట్ వేర్ క్రాంతి కుమార్ ను పట్టుకొని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు.

Also Read : హైద‌రాబాద్‌లో లారీ బీభ‌త్సం.. బైకును ఈడ్చుకెళ్లిన వైనం.. బైకర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్

మద్యం మత్తులో కారు నడిపిన సాప్ట్ వేర్ ఉద్యోగి దాదాపు తొమ్మిది మందిని ఢీకొట్టాడు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి. దానికంటే ముందు సైబరాబాద్ కమిషనరేట్ పిస్తా హౌస్ ఎదురుగా రోడ్డుపై వ్యక్తిని ఢీకొనడంతో అతడు మరణించాడు. ఈ ఘటనలో మొత్తం ఒక కారు, ఒక ఆటో, మూడు బైక్ లు కూడా ధ్వంసం అయ్యాయి. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.