KTR: మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పారు.

KTR: మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ

Ktr

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ లేఖరాశారు. తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మోసం చేసిందని చెప్పారు. రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున లేఖ రాస్తున్నానన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయాలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడా ఉందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చారని, రైతులకి రెండు రక్షల రుణమాఫీ ఇస్తామన్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక షరతులు పెట్టి 40 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని తెలిపారు. రూ.40 వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.17 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పారు. లక్షల మంది రైతులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపైన ఆందోళనలను చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే తాము వారి తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు.

Also Read: పోలవరం దస్త్రాల దహనం ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు : మంత్రి దుర్గేశ్