Yennam Srinivas Reddy : కేసీఆర్, కేటీఆర్ జైలుకే- ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎమ్మెల్యే యెన్నం సంచలన వ్యాఖ్యలు

చెల్లి కవిత తీహార్ జైలుకెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశారు. సీఎం రేవంత్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు.

Yennam Srinivas Reddy : కేసీఆర్, కేటీఆర్ జైలుకే- ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎమ్మెల్యే యెన్నం సంచలన వ్యాఖ్యలు

Yennam Srinivas Reddy

Yennam Srinivas Reddy : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తాజాగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జైలుకి వెళ్లాల్సిందే అని ఆయన అన్నారు.

”ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చాక.. మాజీ మంత్రి కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లాసిందే. నవీన్ రావు, శ్రవణ్ రావు సర్వెంట్ ఎక్విప్ మెంట్ కొనుగోలు చేశారు. అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ విషయంలో మీ ప్రమేయం లేకపోతే లైవ్ డిటెక్టర్ కు వస్తారా..? ఫోన్ ట్యాపింగ్ విషయంపై కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు? పదేళ్ల పాలనలో ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశారు.

శ్రవణ్ రావు, నవీన్ రావు ఫోన్ ట్యాపింగ్ తో వ్యక్తులను బెదిరించి వందల కోట్లు దండుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ వేసి.. లోతైన దర్యాప్తు చేయాలి. ధరణిలో కొన్ని వందల ఎకరాలు నవీన్ రావు పేరుపై బదాలయించారు. నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారు. చెల్లి కవిత తీహార్ జైలుకెళ్తే.. కేటీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు కోసం గోవాలో చిందులు వేశారు. సీఎం రేవంత్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు.

అన్నీ బాగున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ పోటీ చేయడం కాదు.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? ముగ్గురు కుటుంబసభ్యులు మూడు చోట్ల పోటీ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది భాదితులు ఉన్నారు. నేను డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు.. అందరూ ఫిర్యాదు చేయాలి. ప్రతీ జిల్లాలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి.. ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదులు స్వీకరించాలి. రాష్ట్రంలో వీళ్ల ఆగడాలు తెలిసి కూడా కేంద్రంలో ఉన్న వ్యక్తులు మౌనంగా ఎందుకు ఉన్నారో అర్ధం కావడం లేదు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్న చందంగా.. బీజేపీ, బీఆర్ఎస్ వ్యవహరించాయి” అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.

Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో నేనే మొదటి బాధితుడిని: రఘునందన్ రావు