కేటీఆర్ బావమరిది ఫాం హౌస్‌పై పోలీసుల దాడులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదికి చెందిన రాజ్ పాకాల ఫాం హౌస్ పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు.

కేటీఆర్ బావమరిది ఫాం హౌస్‌పై పోలీసుల దాడులు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weekend party in farm house

Updated On : October 27, 2024 / 11:45 AM IST

KTR – bandi sanjay : రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్ కాలనీలోని బీఆర్ఎస్ నేత కేటీఆర్ బావమరిదికి చెందిన రాజ్ పాకాల ఫాం హౌస్ పై సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఫాం హౌస్ లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో.. పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఫారిన్ లిక్కర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకోగా.. ఈ పార్టీలో పాల్గొన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పార్టీలో పాల్గొన్న వారికి పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేశారు. వీరిలో ఒకరు కొకైన్ డ్రగ్ తీసుకున్నట్లు గుర్తించారు. కొకైన్ తీసుకున్నట్లు తేలడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Also Read: Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. 39మంది కానిస్టేబుళ్లు సస్పెండ్

మరోవైపు భారీగా ఫారిన్ లిక్కర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన ఫారిన్ బాటిళ్లను ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. సెక్షన్ 34, ఎక్సైజ్ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. ఈ ఫాం హౌస్ లో జరిగిన పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు మొత్తం 35 మంది ఉన్నట్లు తెలిసింది. ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ చేసుకోవటంతో విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో పరికరాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. ప్లేయింగ్ కార్డ్స్ , ప్లాస్టిక్ కైన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

జన్వాడ ఫాంహౌస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కేటీఆర్ భావమరిది ఫాం హౌస్ లోనే పార్టీలా? ఫాం హౌస్ పార్టీలో ఉన్నవాళ్లందరినీ అరెస్టు చేయాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వి కాంప్రమైజ్ పాలిటిక్స్.. చిత్తశుద్ధి ఉంటే ఫాంహౌస్ పార్టీపై సమగ్ర విచారణ జరపాలి. సీసీ పుటేజీ సహా ఆధారాలు ధ్వంసం కాకుండా చూడాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాల్సిందే. బడా నేతలతో సహా రేవ్ పార్టీలో ఉన్న వాళ్లందరినీ అరెస్టు చేయాలి. చట్టం ముందు అందరూ సమానమని నిరూపించేలా చర్యలు ఉండాలని సంజయ్ ప్రభుత్వానికి సూచించారు.