Pravalika Case : ప్రవళిక కేసు.. శివరామ్ అరెస్ట్, ప్రవళిక ఎవరో తెలియదన్న నిందితుడి తల్లి

ప్రవళిక కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు, ప్రవళిక ఎవరో తమకు తెలియదని శివరాం తల్లి తెలిపారు. Pravalika Case

Pravalika Case : ప్రవళిక కేసు.. శివరామ్ అరెస్ట్, ప్రవళిక ఎవరో తెలియదన్న నిందితుడి తల్లి

Pravalika Case Update (Photo : Google)

Updated On : October 20, 2023 / 8:24 PM IST

Pravalika Case Update : తెలంగాణలో సంచలనం రేపిన వరంగల్ గ్రూప్ 2 విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న శివరాం రాథోడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టులో శివరాంని అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. కోర్టు నుంచి నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. రేపు(అక్టోబర్ 21) ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు.

శివరాం అరెస్ట్ పై అతడి తల్లి, తమ్ముడు మనిరాం స్పందించారు. ప్రవళిక కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రవలికతో తమకు పరిచయం లేదని తెలిపారు. పోలీసులకు మేము పూర్తిగా సహకరించాము అని వెల్లడించారు. అసలు, ప్రవళిక ఎవరో తమకు తెలియదని శివరాం తల్లి తెలిపారు. పోలీసులు నా కొడుకుని అరెస్ట్ చేశారని ఆమె వాపోయారు. కాగా, గ్రూప్ 2 విద్యార్థిని ప్రవళి ఆత్మహత్యకు శివరామే కారణం అంటూ పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.

ప్రవళిక ఆత్మహత్యపై రాజకీయ దుమారం..
ప్రవళిక ఆత్మహత్య ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రవళిక లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంది. అక్టోబర్‌ 13న హాస్టల్‌ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్‌-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు.

Also Read : ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. రెచ్చిపోయిన దొంగలు, మార్షల్ ఆర్ట్ ప్రయోగించి దోపిడీ, తీవ్ర భయాందోళనలో ప్రజలు

వ్యక్తిగత కారణాలే కారణం అని తేల్చిన పోలీసులు..
కాగా, పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ప్రవళిక ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు, ప్రేమ వ్యవహారం కారణం అని తేల్చారు. బాయ్ ఫ్రెండ్ శివరాం వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ ఘటనలో శివరాంపై కేసు నమోదు చేశారు.

ప్రవళిక ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు సేకరించారు. శివరాం అనే యువకుడు ప్రవళికను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రవళిక కుటుంబసభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా శివరాంపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

ప్రభుత్వం నిర్వాకం వల్లే అని రాజకీయ పార్టీల ఆందోళనలు..
కాగా, ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ప్రభుత్వ నిర్వాకం వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాయి.

Also Read : ఆ 2 నిమిషాల ఎంజాయ్‭కి బదులు అమ్మాయిలు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రవళిక బలవన్మరణంపై రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఆందోళన చేసిన 13మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. 143, 148, 341, 332, R/W 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయారెడ్డి, ఓయూ నేత సురేశ్ యాదవ్, భాను ప్రకాశ్, నీలిమ, జీవన్ లపై కేసులు నమోదయ్యాయి.