రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నా: తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్

"రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భాషను మార్చుకోవాలి. ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలి" అని తలసాని అన్నారు.

రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నా: తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్

Updated On : November 1, 2025 / 4:58 PM IST

Talasani Srinivas Yadav: కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ.4 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అలాగే, బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరూపించినా తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తలసాని (Talasani Srinivas Yadav) మీడియాతో మాట్లాడారు.

“రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భాషను మార్చుకోవాలి. ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలి. 23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాలి. బీఆర్ఎస్ హయాంలో 44 వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టాము. కాంగ్రెస్ కేవలం రూ.4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టింది.

హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు అయినా కట్టారా? కేటీఆర్ హైదరాబాద్‌లో తిరగలేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఉన్నారా? లేక వేరే దేశంలో ఉన్నారా?

బీఆర్ఎస్ డిమాండ్‌తోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు? 23 నెలల్లో రేవంత్ రెడ్డి పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నాము.

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోరైల్ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇకపై ట్రైన్‌ టైమింగ్స్‌..

అమీర్‌పేట్‌కు రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు అయింది.. ఏం చేశారో చెప్పండి. ఎన్టీఆర్‌కు మాగంటి గోపీనాథ్‌ వీరాభిమాని. ఎన్టీఆర్‌తో కలిసి మాగంటి గోపీనాథ్ తిరిగారు.

కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసం ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఒక్కటే హైదరాబాద్ నగరంలో ఉందా? మిగతా నియోజకవర్గాలు లేవా?

అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చారు. దేశానికి రెండో రాజధాని నగరం స్థాయిలో హైదరాబాద్ అభివృద్ధి చెందింది.
ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోతే పథకాలు ఆగుతాయని అన్నారు. ప్రజలను రేవంత్ రెడ్డి భయపెడుతున్నారా?
సంక్షేమ పథకాలు ఆగితే పోరాటం ఎట్లా చేయాలో మాకు తెలుసు. అసెంబ్లీని ఏ విధంగా స్తంభింపచేయాలో మాకు తెలుసు.

అసెంబ్లీలో మాట్లాడకుండా పనిచేసే ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి చేశారు. మాగంటి గోపీనాథ్ చివరి వరకు ప్రజల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడితే చూస్తూ ఊరుకోరు” అని తలసాని అన్నారు.