Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

Telangana Assembly Speaker

Telangana Assembly Speaker Election : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది. అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక కోసం అసెంబ్లీ సచివాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. డిసెంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.

ఈ నెల 14న అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరుగనుంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ స్పీకర్ ను ఎన్నికను నిర్వహించనున్నారు. స్పీకర్ పదవికి ఇదివరకు గడ్డ ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. అయితే ఈ పదవికి బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. ఈ నెల 15న అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు.

Alla Ramakrishna Reddy : వైసీపీకి బిగ్ షాక్ : ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

డిసెంబర్ 16న గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాదాలు తీర్మానం ఉంటుంది. స్పీకర్ పదవికి బీఆర్ఎస్ పోటీ చేసినట్టైతే ఎన్నిక ఉంటుంది. బీఆర్ఎస్ పోటీ చేయకపోతే స్పీకర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ ఎన్నికను నిర్వహిస్తారు. అసెంబ్లీ స్పీకర్ కు బాధ్యతలు అప్పగిస్తారు.

ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేల చేత అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం చేయించారు. అంతకముందు రాజ్ భవన్ లో ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ చేత గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది.