13న మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం నిర్ణయం.. కేసీఆర్‌సహా ఎమ్మెల్యేలందరికీ సీఎం రేవంత్ ఆహ్వానం

13వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ మాట్లాడుతూ..

13న మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం నిర్ణయం.. కేసీఆర్‌సహా ఎమ్మెల్యేలందరికీ సీఎం రేవంత్ ఆహ్వానం

Revanth Reddy, KCR Kaleswaram

Updated On : February 10, 2024 / 12:22 PM IST

Kaleshwaram Project Visit : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపంపై ప్రభుత్వం ఛలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఈనెల 12తో ముగియనున్నాయి. 12న అసెంబ్లీలో ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల, చర్చకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ అప్రప్రియేషన్ బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. అంతకంటే ముందు 11వ తేదీన సీఎల్పీ సమావేశం జరగనుంది. ఇరిగేషన్ చర్చపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు.

Also Read : సీఎం రేవంత్ వర్సెస్ హరీశ్ రావు.. అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై వాడీవేడి చర్చ

13వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ మాట్లాడుతూ.. ఈనెల 13వ తేదీన ఉదయం 10.30 గంటలకు 119 ఎమ్మెల్యేలు, 40మంది శాసన మండలి సభ్యులను కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు ప్రభుత్వం తీసుకెళ్తుందని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా 12న అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చలో పాల్గొనాలని, 13న కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు రావాలని కోరుతున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాక.. ప్రతిపక్ష నేతను ప్రత్యేకంగా ఆహ్వానించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

Also Read : CM Revanth Reddy : బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ నిప్పులు

ఇదిలాఉంటే.. 13వ తేదీన బీఆర్ఎస్ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించనుంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ పట్టణ శివారులోని మర్రిగూడ బైపాస్ వద్ద నార్కట్ పల్లి -అద్దంకి హైవేకి ఆనుకునిఉన్న విశాలమైన స్థలంలో సభను నిర్వహించాలని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. బీఆర్ఎస్ బహిరంగ సభ తలపెట్టిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తేదీని ఖరారు చేసింది. దీంతో తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రాజెక్టుల అంశంపై ఫైట్ తారాస్థాయికి వెళ్లిందని చెప్పొచ్చు.