TSRTC Workers Bandh : ఆర్టీసీ కార్మికుల జంగ్ సైరన్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రెండు గంటలపాటు బస్సులు నిలిపివేయనున్నారు. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ డిపోల ముందు కార్మికులు ధర్నా చేపట్టారు.

TSRTC Workers Bandh : ఆర్టీసీ కార్మికుల జంగ్ సైరన్.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు

TSRTC workers bandh

TSRTC Workers Bandh – Buses Stop : ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడాన్ని నిరసిస్తూ టీఎస్ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. శనివారం కార్మికులు బస్సులు నిలిపివేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రెండు గంటలపాటు బస్సులు నిలిపివేయనున్నారు. ఉదయం 8 గంటల వరకు బస్సుుల నిలిచిపోనున్నాయి. గవర్నర్ వైఖరిని నిరసిస్తూ డిపోల ముందు కార్మికులు ధర్నా చేపట్టారు. బస్సులు నిలిపివేసి ఆయా డిపోల ముందు ధర్నాలు చేస్తున్నారు.

టీఎంయూ పిలుపు మేరకు బస్సులు బంద్ చేశారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు కార్మికులు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు తరలి రావాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి పిలుపునిచ్చారు. 11 గంటలకు నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరుతామని చెప్పారు. ఆర్టీసీ విలీన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించకపోవడం అన్యాయమని చెప్పారు. ఆర్టీసీ బిల్లు ఆగిపోతే 43 వేల 373 మంది కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు.

Jammu And Kashmir : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్, ముగ్గురు సైనికుల మృతి

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే గవర్శర్ తమిళిసై ఆమోదం కోసం ఆర్టీసీ బ్లిల్లును రాజ్ భవన్ కు పంపారు. కానీ, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. ఈ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడానికి నిరసనగా ఆర్టీసీ కార్మికులు శనివారం బంద్ కు పిలుపునిచ్చారు.

మరోవైపు గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లును ఆమోదించకపోతే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) హెచ్చరించింది. ఈ సందర్భంగా టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.  ఆర్టీసీలో ఉన్న 43 వేల 373 మంది కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు నింపితే గవర్నర్ మాత్రం అంధకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TSRTC: 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఎండీ సజ్జనార్ హర్షం

ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడం సరికాదన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపే ఈ బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదించాలని కోరారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులమంతా కలిసి నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అవసరమైతే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం కొసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ విలీనం బిల్లును పాస్ చేయాలని రాష్ట్ర భావిస్తోంది.

కానీ, ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమ అభిప్రాయం చెప్పలేదు. సాంకేతికంగా మనీ బిల్లు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కాన్సెంట్ కోసం పంపింది. అసెంబ్లీ సెషన్ ముగిసే లోగా గవర్నర్ కాన్సెంట్ చెప్పాలి. కానీ, రెండు రోజుల నుంచి గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.