South Korean: తన ప్రియుడిని వెతుక్కుంటూ భారత్‌కు దక్షిణ కొరియా అమ్మాయి

కేఫ్ లో పనిచేసుకుంటున్న వారిద్దరి మధ్య చూపులు కలిశాయి. కొన్నాళ్లకు మనసులూ కలిశాయి.

South Korean: తన ప్రియుడిని వెతుక్కుంటూ భారత్‌కు దక్షిణ కొరియా అమ్మాయి

Korean woman

South Korean woman: ప్రేమించిన భారతీయ యువకుడి కోసం కిమ్ బోహ్ ని (23) అనే దక్షిణ కొరియా అమ్మాయి సొంత దేశం వదిలి ఇండియాకు వచ్చేసింది. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లోని తన బాయ్‌ఫ్రెండ్ కు చెందిన ఫాంహౌస్ లో ఉంటోంది. తనకు నచ్చిన వాడితో తిరుగుతూ ఇక్కడి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది.

ప్రేమ ఇలా చిగురించింది
యూపీకి చెందిన సుఖ్‌జీత్ సింగ్ అనే యువకుడు దక్షిణ కొరియాలోని బూసన్ కు ఉద్యోగం కోసం వెళ్లి ఓ కేఫ్ లో పనిచేశాడు. అదే కేఫ్ లో బిల్లింగ్ కౌంటర్లో కిమ్ బోహ్ ని చేరింది. కేఫ్ లో పనిచేసుకుంటున్న వారిద్దరి మధ్య చూపులు కలిశాయి. కొన్నాళ్లకు మనసులూ కలిశాయి. ఇద్దరి మధ్య ప్రేమచిగురించి డేటింగ్ ప్రారంభించారు.

సుఖ్‌జీత్ సింగ్ పనికి బ్రేక్ తీసుకుని ఆరు నెలల సెలవుపై సొంత ఇంటికి వచ్చేశాడు. అతడు లేని క్షణాలను కిమ్ బోహ్ ని భరించలేకపోయింది. అతడిని విడిచి అన్ని రోజులు ఉండడం ఎలాగో ఆమెకు తెలియలేదు. కొన్ని రోజులకే విమానం ఎక్కి భారత్ వచ్చేసింది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్‌పూర్‌లోని సుఖ్‌జీత్ సింగ్ ఇంటికి వెళ్లింది. కిమ్ ను చూసి సర్‌ప్రైజ్ అయ్యాడు సుఖ్‌జీత్ సింగ్. ప్రేమించిన యువతి ఏకంగా ఇంటికే వచ్చేయడంతో అతడి ఆనందానికి అవధులు లేవు.

గురుద్వారాకు వెళ్లి పెళ్లి

ఆమెను గురుద్వారాకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు సుఖ్‌జీత్ సింగ్. తన భార్యతో కలిసి కొరియాలో శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటున్నానని సుఖ్‌జీత్ సింగ్ చెప్పాడు. కిమ్ ప్రస్తుతం టూరిస్ట్ వీసాతో భారత్ లో ఉందని, నెలరోజుల్లో కొరియా వెళ్లిపోతుందని అన్నాడు. తాను మరో మూడు నెలల తర్వాత కొరియాకు వెళ్తానని వివరించాడు. సుఖ్‌జీత్ సింగ్ తల్లి కూడా వారి పెళ్లికి అంగీకరించింది. తనకు భారత్ బాగా నచ్చిందని కిమ్ చెప్పింది.

Viral Video: భారత్‌లో కూరగాయలు కొనుక్కున్న జర్మనీ మంత్రి.. ఆ తర్వాత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..