ఏపీలో భారీగా పెరిగిన మద్యం ధరలు : షాక్లో మందుబాబులు

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు భారీగా పెరిగాయి. దీంతో మందుప్రియులు అంతకంటే ఎక్కువ షాక్ కు గురవుతున్నారు.
ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించింది. స్వదేశీ, విదేశీ మద్యం బాటిల్స్ పై మినిమమ్ గా రూ.10 నుంచి రూ.250 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన మద్యం ధరలు మంగళవారం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి.
అలాగే ఈరోజు నుంచి ఏపీలో మద్యం అమ్మకాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే కొనసాగనున్నాయి. ఇక రెడీ టు డ్రింక్ పేరుతో అమ్మే 250/275 ML బాటిల్స్ పై రూ.20 పెంచింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..స్వదేశీ, విదేశీ మద్యం క్వార్టర్ సీసాపై రూ.20, హాఫ్ బాటిల్పై రూ.40, ఫుల్ బాటిల్పై రూ.80 పెరిగింది. స్వదేశీ మద్యం 60/90 ఎంఎల్ బాటిళ్లపై రూ.10, లీటరు మద్యం సీసాపై రూ.100, రెండు లీటర్ల బాటిల్పై రూ.250 పెంచారు. విదేశీ మద్యం 50/60 ఎంఎల్ సీసాలపై రూ.10, లీటరున్నరరెండు లీటర్లు కలిగిన మద్యం బాటిళ్లపై రూ.250 పెరిగింది. ఇక, 330/500 ఎంఎల్ బీర్ సీసాలపై రూ.10, 650 ఎంఎల్ బీరు బాటిల్స్ పై రూ.20 పెరిగింది. పెరిగిన ధరలు అక్టోబర్ 1నుంచే అమల్లోకి రానున్నాయి.