ఏపీలో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ లో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు అయింది. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది.

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 02:53 PM IST
ఏపీలో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు

Updated On : December 31, 2019 / 2:53 PM IST

ఆంధ్రప్రదేశ్ లో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు అయింది. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో కనెక్టు టు ఆంధ్రా సొసైటీ ఏర్పాటు అయింది. అమరావతి-కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నిర్వహణ కోసం ఏపీ ప్రభుత్వం కనెక్టు టు ఆంధ్రా సొసైటీని ఏర్పాటు చేసింది. లాభాపేక్ష రహిత సంస్థగా కనెక్ట్ టు ఆంధ్రా సొసైటీ పనిచేయనుంది. ఈ మేరకు మంగళవారం (డిసెంబర్ 31, 2019) రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

సీఎస్ఆర్ నిధుల నిర్వహణ కోసం ఉన్నత, క్షేత్ర స్థాయిల్లో 2 కమిటీలు వేశారు. కనెక్ట్ టు ఆంధ్రా కోసం సీఎం జగన్ నేతృత్వంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా ఆర్థికమంత్రి, సీఎస్ సహా మూడు ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఉంటారు.

జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేశారు. సీఎస్ఆర్ నిధులకు నవరత్నాల పూల్ ఫండ్ కు కేటాయించేందుకు కార్యాచరణ రూపొందించారు. అభివృద్ధి చేయాల్సిన పనుల జాబితానూ కనెక్ట్ టు ఆంధ్రా సొసైటీ సిద్ధం చేయనుంది. నవరత్నాల పథకాలతో విద్య, వైద్య రంగాల్లోనూ సీఎస్ఆర్ నిధుల వినియోగం జరుగనుంది.