కొత్త రూల్ : 6 కంటే ఎక్కువ బీరు సీసాలు ఉంటే చర్యలు

ఏపీలో సంపూర్ణ మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ

  • Published By: veegamteam ,Published On : September 25, 2019 / 04:01 PM IST
కొత్త రూల్ : 6 కంటే ఎక్కువ బీరు సీసాలు ఉంటే చర్యలు

Updated On : September 25, 2019 / 4:01 PM IST

ఏపీలో సంపూర్ణ మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ

ఏపీలో సంపూర్ణ మద్యం నిషేధం దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మద్యం షాపుల సంఖ్య తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా మరో ఉత్తర్వు జారీ చేసింది. ఒక వ్యక్తి దగ్గర పరిమితికి మించి మద్యం బాటిళ్లు కలిగి ఉండరాదని ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో వ్యక్తి దగ్గర 3 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు ఉంటే చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఉత్తర్వులు ప్రకారం.. ఏ వ్యక్తి దగర అయినా 3 సీసాలకు మించి స్వదేశీ, విదేశీ మద్యం సీసాలు ఉండకూడదని ఏపీ ఎక్సైజ్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం(సెప్టెంబర్ 25,2019) నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం బీరు సీసాలు ఆరుకు మించి ఉండకూడదు. తాటికల్లు కూడా 2 లీటర్లకు మించి ఉండకూడదు.

విడతల వారీగా సంపూర్ణ మద్యపానం నిషేధమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహిస్తుంది. ఏపీ ఎక్సైజ్ శాఖ నూతన నిబంధనలు తీసుకొచ్చింది. ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి మద్యం షాపు దగ్గర ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ పర్యవేక్షణ ఉంటుంది. సర్కారీ మద్యం షాపుల దగ్గర పర్మిట్ రూమ్ లు ఉండవు. రోడ్డుపై మద్యం సేవిస్తే శిక్షిస్తామని ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఎమ్మార్పీ రేట్లకే మద్యం విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.