ఏపీలో కొత్త పెన్షన్లు
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల మంజూరు కోసం (నవంబర్ 21, 2019) నుంచి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన కార్యక్రమం చేపట్టనుంది. (నవంబర్ 25, 2019) వరకు వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్ల పరిధిలో అర్హుల నుంచి వారి ఇంటి దగ్గరకే వెళ్లి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇప్పటికే అధికారుల దగ్గర పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సైతం వాలంటీర్లు పరిశీలించి.. వాటిలోనూ అర్హత ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకుంటారు. పింఛన్ల కోసం కొత్తగా అందిన దరఖాస్తులతోపాటు ప్రస్తుతం పెన్షన్లు పొందుతున్నవారి వివరాలతో గ్రామ, పట్టణ వార్డులవారీగా జాబితాలు తయారు చేస్తారు. వాటిపై ఆ ప్రాంత ప్రజలందరి సమక్షంలో డిసెంబర్ 1 నుంచి 14వ తేదీల మధ్య సోషల్ ఆడిట్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. (డిసెంబర్ 15, 2019) మంజూరు చేసిన తుది పింఛనుదారుల జాబితాను ప్రకటించి.. కొత్తగా పెన్షన్లు మంజూరైన వారికి 2020, జనవరి 1 నుంచి పంపిణీ చేయనున్నట్లు వివరించారు.
కొత్త పింఛనుదారుల దరఖాస్తుల స్వీకరణ, ఇప్పటికే పింఛను తీసుకుంటున్నవారి వెరిఫికేషన్ ప్రక్రియపై (నవంబర్ 5, 2019) నుంచి అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది. 5న జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున శిక్షణ ఇస్తారు. నవంబర్ 7, 8 తేదీల్లో ప్రతి మండలం, మున్సిపాలిటీ నుంచి ఇద్దరు చొప్పున అధికారులకు జిల్లా స్థాయిలో శిక్షణ అందజేయనున్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో నవంబర్ 12, 13, 14 తేదీల్లో స్థానిక సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. నవంబర్ 15 నుంచి 20 తేదీల మధ్య గ్రామ, వార్డు వాలంటీర్లకు ఈ ప్రక్రియపై శిక్షణ ఇవ్వనున్నారు.