Viral Pic: తల్లికి ఆరేళ్ల బాలుడు రాసిన నోట్ ఫొటో వైరల్

మీరు ఈ ఆదివారాన్ని చాలా డల్ గా గడుపుతున్నట్లు ఫీల్ అవుతుంటే ఈ ఫొటో చూడండి. కాస్త హుషారు అవుతారు. ఓ బాలుడు తన తల్లికి రాసిన నోట్ కు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. షెమటాలజిస్ట్, ఎండీ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు.

Viral Pic: తల్లికి ఆరేళ్ల బాలుడు రాసిన నోట్ ఫొటో వైరల్

Viral Pic

Viral Pic: మీరు ఈ ఆదివారాన్ని చాలా డల్ గా గడుపుతున్నట్లు ఫీల్ అవుతుంటే ఈ ఫొటో చూడండి. కాస్త హుషారు అవుతారు. ఓ బాలుడు తన తల్లికి రాసిన నోట్ కు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. షెమటాలజిస్ట్, ఎండీ అనే ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు.

“ప్రియమైన అమ్మ.. నువ్వు ఈ రోజుని చాలా క్లిష్టతరంగా గడుపుతోంటే నన్ను మన్నించు” అని ఓ ఆరేళ్ల బాలుడు రాశాడు. ఈ నోట్ ని తాను జీవితాంతం తన వద్దే ఉంచుకుంటానని ఆ తల్లి పేర్కొంది. ఈ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కాసేపటికే ఇది బాగా వైరల్ అయింది. తల్లి పడుతున్న కష్టాన్ని గుర్తించే పిల్లలు చాలా అరుదుగా ఉంటారని కొందరు కామెంట్లు చేశారు.

అటువంటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి అదృష్టవంతురాలని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. పిల్లల నుంచి ఇటువంటి వ్యాఖ్య రావడం చాలా అరుదుగా జరుగుతుందని కొందరు కామెంట్లు చేశారు. పిల్లల కోసం తల్లి ఎన్నో కష్టాలు పడుతుందని, ప్రతిరోజు త్యాగాలు చేస్తుందని, అటువంటి తల్లి హృదయాన్ని గాయపర్చకుండా ఉండడం ముఖ్యమని ఓ వ్యక్తి పేర్కొన్నారు. తన కుమారుడు కూడా ఓ సారి ఇలాగే తనకు ఓ నోట్ రాశాడని ఓ మహిళ కామెంట్ చేసింది.

International Year of millets 2023 : అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా 2023ను ఎందుకు పరిగణిస్తున్నారో తెలుసా?